పెట్టు‘బడి’ లేదు!
సర్కారు పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా
నామమాత్రంగా మన ఊరు.. మన బడి
న్యూస్టుడే, వరంగల్ విద్యావిభాగం
సర్కారు పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎంపికైనా పాఠశాలల్లో పాలకులు, అధికారులు చాలా వరకు పనుల ప్రారంభం కొరకు శంకుస్థాపనలు మాత్రమే చేశారు. ఆ స్థాయిలో పనులు పుంజుకోవడంలేదు. ప్రతిపాదనలు, అంచనాలు, పరిశీలనలు, ఆమోదం వంటి వాటికే ఎక్కువ సమయం పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెజారిటీ బడుల్లో పనులు ప్రారంభం, నిధుల మంజూరు వంటి విషయాల్లో జాప్యమే నెలకొంటోందని అధికారులు చెబుతున్నారు.
రూ.30లక్షల లోపు పనులకు కలెక్టర్ అమోదం
జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 645 కాగా అందులో మొదటి విడతలో భాగంగా 223 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. మౌలిక వసలుతులకు రూ.30 లక్షలలోపు పనులు చేపట్టడానికి కలెక్టర్ అవకాశం ఉంటుంది. అంతకు మించి వ్యయానికి సంబంధించిన పనులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలు పంపావలసి ఉంటుంది జిల్లా పరిధిలో 32 బడుల్లో పనులకు శంకుస్థాపనలు చేశారు. 18 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. 35 పాఠశాలలకు పనులకు సంబంధించి 15 శాతం నిధులను ఆయా పాఠశాలల ఎస్ఎంసీ, ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు బదిలీ చేశారు. మిగతా బడుల్లో అంచనాల దశలోనే ఉన్నాయి.
త్వరపడితేనే సాకారం..
పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడింది. జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేసవిలో సదుపాయాలను అభివృద్ధి చేసి బడుల ప్రారంభానికి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. సౌకర్యాలు మెరుగైతే సర్కారు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వేసవి సెలవుల్లోనే పనులు పూర్తి చేస్తే సౌకర్యంగా ఉంటుందని, తరగతులు జరిగే సమయంలో పనులు చేపడితే చదువులకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అదనపు గదుల జాడలేదు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని ఈ కార్యక్రమంలో పొందుపరిచారు. ప్రస్తుతం నిధులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉండటంతో వీటి నిర్మాణాన్ని పక్కనపెట్టారు. కేవలం చిన్న చిన్న మరమ్మతులతో పాటు మౌలిక సదుపాయాలకు నిధులు వెచ్చిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
-డి.వాసంతి, జిల్లా విద్యాశాఖ అధికారి
ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి మన ఊరు మనబడి కార్యక్రమంలో పనులు జరుగుతున్నాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో కమిటీలను నియమించాం. ఎప్పటికప్పడు పనులను పర్యవేక్షిస్తున్నాం. త్వరితగతిన పూర్తి చేస్తాం.
అంచనాలతోనే కాలయాపన
నర్సంపేట రూరల్,న్యూస్టుడే: నర్సంపేట మండలం లక్నేపల్లి ఉన్నత పాఠశాలలో పనులు చేపట్టేందుకు రూ.61లక్షల పనులకు అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించారు. నిధుల ఆధారంగా మరోమారు రూ.30లక్షలకు అంచనా వేశారు. 170 మంది విద్యార్థులకు యూడైస్ ప్రకారం 11 గదులుండాల్సి ఉండగా ప్రస్తుతం 9 మాత్రమే ఉన్నాయి. 9 గదులకు రంగులు, విద్యుత్తు సరఫరా, చాక్ బోర్డులు, తాగునీటి ఫ్లాట్ఫాం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతవరకు పనులు మొదలు కాలేదు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నా ఇంత తక్కువ సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయడం కష్టమేనని అధికారులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.
అరకొర నిధులు.. ప్రారంభంకాని పనులు
దుగ్గొండి, న్యూస్టుడే: దుగ్గొండి మండలంలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు దాతలెవరూ విరాళాలు అందజేయలేదు. 14 పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి రూ. 47.60 లక్షలు, 66 మూత్రశాలలకు రూ.198 లక్షలు, 12 ప్రహరీలకు రూ.69.16 లక్షలు, నీటి వసతికి రూ163.19 లక్షలు, విద్యుత్తు మరమ్మతులకు రూ.322.74లక్షలు, ప్రత్యేక మరమ్మతులకు రూ.133.83 లక్షలు, అదనపు తరగతి గదులకు రూ. 140.37 లక్షలు ప్రతిపాదనలు పంపారు. కేవలం ఆరు పాఠశాలల్లో పనులకు రూ.117.04 లక్షలకు ప్రతిపాదనలు పంపగా 15 శాతం నిధులు మాత్రమే మంజూరు చేశారు. పనులు మాత్రం ఎక్కడా కార్యరూపం దాల్చలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!