విద్యార్థి.. విజయీభవ..!
హలో విద్యార్థులూ.. నేను మీ పదో తరగతి పబ్లిక్ పరీక్షను. మిమ్మల్ని రేపు కలుసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. కరోనా తర్వాత రెండేళ్ల విరామం తర్వాత మిమ్ముల్ని కలుస్తున్నా.. అధికారులు సైతం
న్యూస్టుడే, జనగామ అర్బన్: హలో విద్యార్థులూ.. నేను మీ పదో తరగతి పబ్లిక్ పరీక్షను. మిమ్మల్ని రేపు కలుసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. కరోనా తర్వాత రెండేళ్ల విరామం తర్వాత మిమ్ముల్ని కలుస్తున్నా.. అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మీ రాక కోసం ఎదురు చూస్తున్నా. మరి మీరు కూడా సిద్ధమే కదా? ఇంటికి గడప ఎంత ముఖ్యమో మీ ఉన్నత చదువులకూ నేను అంతే అవసరం. నిర్లక్ష్యాన్ని వీడండి.. భయాన్ని పారదోలండి. సత్ఫలితాలను ఆశించండి. నేను చెప్పే కొన్ని సూచనలు పాటించి పరీక్షల్లో విజయం సాధించండి.
నిద్ర.. ఆహారపు అలవాట్లు కీలకం : ప్రణాళిక ప్రకారంగా చదివితేనే ప్రయోజనం ఉంటుంది. ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మనసు ప్రశాంతంగా ఉంటుందని.. చదివిన అంశాలు ఎక్కువ గుర్తుంటాయని విద్యా నిపుణులు సూచిస్తుంటారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కొందరు పరీక్ష ముందు రోజు రాత్రి సమయంలో నిద్రపోకుండా చదువుతుంటారు. ఇలా చేస్తే మర్నాడు పరీక్ష సరిగా రాయలేరు. 7-8 గంటల వరకు నిద్రకు కేటాయించాలి. వెంటవెంటనే రకరకాల సబ్జెక్టులను చదవకూడదు. పరీక్షలు ముగిసే వరకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం రోజులపాటు వినోదాలకు దూరంగా ఉండి ఏకాగ్రతతో చదివితే మంచి మార్కులు సాధించేందుకు ఆస్కారంగా ఉంటుంది.
మానసిక ప్రశాంతత.. ఆత్మవిశ్వాసం అవసరం : మీరు మొదటిసారిగా బోర్డు పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అవగాహన లేమి, ఆందోళన ఇతరత్రా కారణాలు మిమ్ముల్ని వేధిస్తుంటాయి. ప్రశ్నపత్రం ఎంత కఠినంగా వస్తుందో, ఎలా రాయాలో, తక్కువ మార్కులు వస్తే చదువులో వెనుకబడి పోతామేమో అనే ప్రశ్నలు ఆందోళనకు గురి చేస్తుంటాయి. వీటి గురించి ఆలోచించకండి.. పరీక్ష బాగా రాయగలను అనే పాజిటివ్ దృక్పథంతో ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి భయాలూ ఉండవు. కొందరు పరీక్షకు వెళ్లే క్రమంలో బస్సుల్లోనో, ఆటోల్లో చదువుతుంటారు. ఇలా చేయడం సరికాదు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలి.
చక్కని చేతిరాత ప్రధానం..
ఈసారి మీకో చక్కని అవకాశం. గతంలో ఒక సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉండేవి. ఈ ఏడాది వాటిని ఆరు పేపర్లకు కుదించడం మీకు మేలు చేకూర్చే అంశం. సిలబస్ కూడా డెభ్బై శాతం నిర్ణయించడం, ఛాయిస్ ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశముంది. ఇంత చక్కని అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలి. రాసే ప్రతి అంశాన్ని పాయింట్ల వారీగా చక్కని చేతిరాత ఉంటే మంచి మార్కులు సాధించొచ్చు. పరీక్షల సమయంలో పునశ్చరణపైనే దృష్టి సారించండి. కొత్త అంశాలు చదవాలని ప్రయత్నించకండి. ఇలా చేస్తే అయోమయానికి గురవుతారు.
ఇట్లు
పదోతరగతి పబ్లిక్ పరీక్ష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓట్టేద్దాం..ఓరుగల్లు వైభవాన్ని కాపాడుదాం
[ 18-04-2024]
ఉమ్మడి వరంగల్ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి. -
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఉదయం నుంచి నామపత్రాల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలవుతున్న యంత్రాంగం ఇక నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. -
అందరి సంక్షేమం.. పార్టీల సంకల్పం
[ 18-04-2024]
ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో).. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, ప్రజలకు చేసే మేలు గురించి తెలియజేసే విధానపరమైన హామీ పత్రం. పార్టీల ఎన్నికల ప్రచారం వీటి చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా ఇది పార్టీ భవిష్యత్తు ముఖచిత్రం.. -
నామపత్రాలకు వేళాయె!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
లోక్సభ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ పోటీ
[ 18-04-2024]
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తెలిపారు. -
ఓటరుకు ఆహ్వానం..
[ 18-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ హనుమకొండ నగరంలోని నయీంనగర్లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూరపాటి సత్యనారాయణ వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
అటవీ సంరక్షకులు..!
[ 18-04-2024]
వేసవి తీవ్రత దృష్ట్యా అభయారణ్యంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ యంత్రాంగం శ్రమిస్తోంది. కన్నాయిగూడెం మండలం అటవీ శాఖ ఉత్తర రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఎక్కడ మంటలు చెలరేగినా వెంటనే స్పందిస్తూ అడవిని కాపాడుతున్నారు. -
దేవాదుల పంపింగ్ ఆగింది.. పంట ఎండింది..
[ 18-04-2024]
ఎన్నో ఆశలతో సేద్యం చేస్తున్న అన్నదాతలకు చి‘వరి’ తడులకు కష్టాలు తప్పడం లేదు. నారు పోసినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. -
పేలుడు పదార్థాల రవాణాపై నియంత్రణ ఏది?
[ 18-04-2024]
గత నెల 27న మరిపెడ ఠాణా పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వీరారం క్రాస్ రోడ్డు సమీపంలో తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో 50 ఎలక్ట్రానిక్ డిటోనెటర్లు, 32 జిలిటెన్ స్టిక్స్, 20 బాక్సుల్లో జిలిటెన్ స్టిక్స్ బూస్టర్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
లోక్సభ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు
[ 18-04-2024]
ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. ‘మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
‘రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన భారాస’
[ 18-04-2024]
‘సంపద కలిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే అధికారంలోకి వచ్చిన భారాస పెద్దలు దోపిడీ దొంగల్లా రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్ప చేశారు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి ఆరోపించారు. -
సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సూచించారు. -
డీడీలు కట్టరు.. పంచదార ఇవ్వరు!
[ 18-04-2024]
రేషన్ దుకాణాల ద్వారా అంత్యోదయ కార్డుదారులకు కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నా డీలర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో బయట కిరాణాల్లో ఎక్కువ మొత్తం చెల్లించి పంచదార కొనుగోలు చేస్తున్నారు. -
బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కల నరికివేత
[ 18-04-2024]
కొత్తగూడ మండలం వేలుబెల్లిలోని బృహత్ పల్లెపకృతి వనంలోని సుమారు 25వేల మొక్కలు నరికివేతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సివిల్స్ ర్యాంకర్లకు ఘన సత్కారం
[ 18-04-2024]
సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు సుధాకర్ కుమారుడు మెరుగు కౌశిక్ను బుధవారం జిల్లాకు చెందిన ఆవోపా(ఆర్యవైశ్య ప్రొఫెషనల్ ఫెడరేషన్), ఐవీఎఫ్(ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్), ఇతర ప్రతినిధులు హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. -
చేసిన పనులకు బిల్లులివ్వకపోతే చనిపోతా..
[ 18-04-2024]
‘పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిన ప్రకారం ప్రజలకు అత్యవసర పనులు చేస్తే.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బిల్లులు చేయకుండా అవస్థలు పెడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు