logo

నాలుగేళ్ల కిందట హత్య.. ఛేదించిన పోలీసులు

జిల్లాలోని మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లిలో నాలుగేళ్ల కిందట జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు

Published : 22 May 2022 03:10 IST

భూపాలపల్లి క్రైం, న్యూస్‌టుడే: జిల్లాలోని మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లిలో నాలుగేళ్ల కిందట జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలను ఎస్పీ సురేందర్‌రెడ్డి తన కార్యాలయంలో శనివారం వెల్లడించారు. 2018లో మహారాష్ట్రకు చెందిన 10 మంది కూలీలు మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లిలోని ఓ రైతుకు మిర్చి ఏరడానికి వచ్చారు. చేను దగ్గర్లోనే ఆ 10 మంది గుడారం వేసుకొని ఉంటూ పనులు చేస్తున్నారు. తాను స్నానం చేస్తుండగా సేతు తుక్కుదురువా అనే వ్యక్తి చూస్తున్నాడని తన భర్తకు ఆయన భార్య తెలిపింది. తోటి కూలీ బండు ఉసేండితో ఈ విషయం తెలియజేశాడు భర్త. ఇద్దరు కలిసి అతన్ని మందలించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇద్దరు కలిసి సేతు తుక్కదురువాను రోకలి బండతో భాగా కొట్టారు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరిలో 2020లో విన్ను వడ్డే కొవిడ్‌తో చనిపోయాడు. బండు ఉసేండి తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతన్ని పట్టుకొని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితున్ని పట్టుకున్న సీఐ కిరణ్, ఎస్సై రాజ్‌కుమార్, కానిస్టేబుల్స్‌ ధనుంజయ్, కిరణ్, శ్యాంలను ఎస్పీ అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని