logo

రోడ్డు ప్రమాదంలో యువ వైద్యుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువ వైద్యుడు మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రామన్నకుంట తండా శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 23 May 2022 04:08 IST


రాజు (పాతచిత్రం)

చెన్నారావుపేట, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో యువ వైద్యుడు మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రామన్నకుంట తండా శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటకు చెందిన కుదురుపాక రాజు(28) ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. రాజు నెక్కొండలో తోటి వైద్యుడి వివాహ వేడుకకు హాజరై తిరిగి నర్సంపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో రామన్నకుంటతండా వద్ద దుక్కిటెద్దు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనం అదుపు తప్పడంతో ఎద్దును ఢీ కొంది. దీంతో రాజు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. దుక్కిటెద్దు తీవ్రగాయాలపాలై మృతి చెందింది. చెన్నారావుపేట ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నర్సంపేటకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని