ఈకేవైసీ నమోదు.. పీఎం కిసాన్ అమలు
అన్నదాతలకు సాగు అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన రైతులకు రూ. 2 వేల చొప్పున ఏటా మూడు సార్లు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తుంది.
అర్హులైన రైతులు
ఈకేవైసీలో నమోదు చేసుకున్న వారు
అన్నదాతలూ కదలండి
భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: అన్నదాతలకు సాగు అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన రైతులకు రూ. 2 వేల చొప్పున ఏటా మూడు సార్లు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తుంది. కొంత మంది అనర్హులు తప్పుడు పత్రాలు సృష్టించి లబ్ధిపొందుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అనర్హులను తొలగించే పనిలో భాగంగా ఈ కేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. ఈకేవైసీ నమోదు చేయడంలో అన్నదాతలు ఆసక్తి చూపడం లేదు. సరైన అవగాహన లేని కారణంగా ముందుకు రావడం లేదు. ఈనెల 31తో గడువు ముగుస్తుంది. అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
4.52 లక్షల మంది..
2018లో కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. సంవత్సరానికి మూడు పర్యాయాలు రూ. 2 వేల చొప్పున నగదు జమచేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో 452072 మంది అన్నదాతలు అర్హులుగా ఉండగా ఇప్పటి వరకు కేవలం 49118 మంది రైతులు మాత్రమే ఈకేవైసీ నమోదు చేసుకున్నారు.
ఇలా చేసుకోండి..
మొదట బ్యాంక్కు వెళ్లి ఖాతాకు ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్లో చరవాణి ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్లో www.pmkisan.gov.in లింకును తెరవగానే అందులో ఈకేవైసీీ అప్డేట్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి సంబంధిత రైతు ఆధార్ నెంబర్ను నమోదు చేయాలి. ఈ నంబర్ అనుసంధానం అయినటువంటి చరవాణికి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి పీీఎం కిసాన్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. చరవాణికి వచ్చిన ఓటీపీీని అక్కడ నమోదు చేసి సబ్మిఫట్ను క్లిక్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. పట్టాదార్ పాస్ పుస్తకాలతో మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్