‘పట్టా’ రాని ఆవేదన!
రెవెన్యూ చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయడంతో పాటు ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ పట్టాదారు పాసుపుస్తకాలు రాక రెవెన్యూ అధికారులు పెడుతున్న కొర్రీలతో అన్నదాతలకు
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: రెవెన్యూ చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయడంతో పాటు ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ పట్టాదారు పాసుపుస్తకాలు రాక రెవెన్యూ అధికారులు పెడుతున్న కొర్రీలతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. తహసీల్దార్ కార్యాలయం.. కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వెళ్లి అర్జీలు సమర్పించినా ఫలితం కానరాలేదని బాధితుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
బాధిత రైతులు సుమారు మూడేళ్ల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూ ప్రక్షాళన సమయంలో పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడంతో వాటి కోసం అధికారుల వద్దకు వెళ్తున్నా ఫలితం కానరావడం లేదు. ధరణి పోర్టల్ వచ్చాక కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం లభించలేదు. దీంతో బ్యాంకుల్లో రుణాలు రాక.. పెట్టుబడి సాయానికి నోచుకోవడం లేదు.
పెండింగ్లో 174 అర్జీలు
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం వచ్చిన సుమారు 174 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. అందులో అయా మండలాలకు 40 అర్జీలను ఫార్వర్డు చేయగా 138 చేయాల్సి ఉంది.
ఇతను మహబూబాబాద్ మండలంలోని నడివాడకు చెందిన మహ్మద్ అంకూస్. రైల్వే విశ్రాంత ఉద్యోగి. గ్రామంలోని సర్వే నంబరు 149/1/సీ, 150/బి, 182/74/బి, 182/2/బిలో రెండు ఎకరాల పదమూడున్నర గుంటల భూమి ఉంది. భూప్రక్షాళన సమయంలో ఉద్యోగరీత్యా గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారులు కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని చెబితే 2020, నవంబరు 3న చేశారు. అధికారులు పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడం లేదు. దీని వల్ల రైతబంధు సాయం అందడం లేదని..ఇప్పటికైనా పట్టాదారు పాసుపుస్తకం అందించాలని కోరుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాన్ని పట్టుకున్న ఇతని పేరు గుగులోతు తిరుపతి. వీరిది మహబూబాబాద్ మండలం అమనగల్ పరిధిలోని భజనతండా. ఇతని తండ్రి గుగులోతు బావుసింగ్ పేరిట ఆరు ఎకరాల ఇరవై గుంటల భూమి ఉంది. భూప్రక్షాళన సమయంలో వీరి భూమిని మరో రైతుకు పట్టా అందించారు. ఈ సమస్య పరిష్కరించాలంటూ బాధితులు రెండేళ్లుకు పైగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పలుమార్లు ప్రజావాణికి వచ్చి అర్జీ సమర్పించినా భూమి తమ పేరిట కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కురవి మండలం తాళ్లసంకీసకు చెందిన భూక్య సుక్యకు అదే మండలంలోని ఉప్పరిగూడెం శివారులో రెండు సర్వేనంబర్లలో రెండు ఎకరాల తొమ్మిది గుంటల భూమి ఉంది. సర్వేనంబరు 541/ఎ/1లోని 1-02 ఎకరాల భూమికి మాత్రమే కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. సర్వేనంబరు 540/ఈ లోని 1-07 ఎకరాల భూమిని చేర్చాలని ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. డిజిటల్ సైన్ కోసం మూడేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి 15 సార్లు, ప్రజావాణికి మూడుసార్లు వచ్చారు. కార్యాలయాల చుట్టూ తిరగడానికి, ధరణిలో దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటి వరకు రూ.4 వేల వరకు ఖర్చు అయ్యాయని అయినా అధికారులు కరణించడం లేదని రైతు సుక్య విచారం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM