ఉద్యోగార్థులే.. విలేకరులై
పోలీసు, గ్రూప్ 1 ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం విలేకరులుగా మారి మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్తో ముఖాముఖి నిర్వహించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక జిల్లా గ్రంథాలయంలో చదువుకునే అభ్యర్థులు హాజరయ్యారు.
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్
అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసిన ఎస్పీ శరత్చంద్రపవార్
పోలీసు, గ్రూప్ 1 ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం విలేకరులుగా మారి మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్తో ముఖాముఖి నిర్వహించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక జిల్లా గ్రంథాలయంలో చదువుకునే అభ్యర్థులు హాజరయ్యారు.
బి.సురేష్: పోటీ పరీక్షలు రాయడానికి చిన్న నాటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకోవాలా?
ఎస్పీ: చిన్నప్పుడే లక్ష్యాన్ని ఎంచుకోవడం మంచిదే. నేనైతే సివిల్స్ రాయాలనే లక్ష్యాన్ని 24 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నా. ఆ దిశగా పుస్తకాలను సేకరించి చదివాను. రెండు సార్లు చివరి వరకు వచ్చి తప్పినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. ఇప్పుడు మీ ముందు మీ జిల్లా ఎస్పీగా ఉన్నాను.
ఎన్.సురేష్: అన్ని పోటీ పరీక్షలకు కామన్ సిలబస్ ఉంటుందా? గ్రూప్స్నకు ఎలా సిద్ధం కావాలి. సివిల్స్కు సిలబస్ ఏవిధంగా ఉంటుంది.
* కామన్ సిలబస్ ఉంటుంది. జనరల్ స్టడీస్, ఇంగ్లిష్, దేశ, తెలంగాణ చరిత్ర, ఇలా తదితర సబ్జెక్టులుంటాయి. కొన్నింటికి మ్యాథ్స్, రీజనింగ్ అంశాలుంటాయి. గ్రూప్స్ రాసే వారు అకాడమీ పుస్తకాలతో పాటు దినపత్రికలు విధిగా చదవాలి. సివిల్స్ రాయాలనుకుంటున్న వారు కూడా అకాడమీతో పాటు ఎన్సీఆర్టీ పుస్తకాలను చదవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.
రంజిత్: పోటీ పరీక్షలకు ఇంటి వద్ద ఉంటూ చదువుకోవచ్చా.. కోచింగ్ సెంటర్లకు వెళ్లి చదువుకోవడం మంచిదా?
* శిక్షణ కేంద్రానికి వెళ్లడం మంచిదే. దీంతో సిలబస్, చదివే విధానం తెలుస్తుంది. ఒకవేళ ఇంట్లో చదువుకున్నా ఇబ్బంది ఉండదు. కాకపోతే అనుకూలమైన వాతావరణం ఉండాలి.
నరేశ్: డీఎస్సీతో పాటు పోలీస్, గ్రూప్ ఉద్యోగాల కోసం చదువుతున్నాం. వాటికి పుస్తకాలు చదివితే సరిపోతుందా..?నోట్స్ సిద్ధం చేసుకోవాలా?
* ప్రకటన వచ్చాక పరీక్షలకు ఎంత సమయం ఉందో చూసుకోవాలి. మంచి పుస్తకాలను ఎంచుకుని చదవాలి. అవి గుర్తుండేలా నోట్స్ సిద్ధం చేసుకోవడం మంచి ప్రయోజనం. దాని వల్ల ప్రతి అంశం గుర్తుండడంతో పాటు మళ్లీ ఆ నోట్స్ను తిరిగేస్తుంటే చదివిన అంశాలు గుర్తుకు వస్తాయి. పోలీసు ఉద్యోగాల కోసం చదివే అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కూడా ముఖ్యమే. అందులోనూ నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా తర్ఫీదు పొందాలి.
ప్రిలిమ్స్కు ముందురోజు సినిమాకెళ్లాను..
షరీఫ్: పరీక్ష హాల్ అంటే భయం ఉంటుంది. దానిని ఏవిధంగా దూరం చేసుకోవాలి. రోజుకు ఎన్ని గంటల పాటు చదవాలి?
* ఏకాగ్రతతో చదివితే ఎలాంటి భయం ఉండదు. నేను ప్రిలిమ్స్కు ముందు రోజు సినిమాకు వెళ్లాను. రోజుల తరబడి చదివిన వారు పరీక్షకు ముందు చదవకున్నా ఫర్వాలేదు. అలాగే రోజుకు ఎన్ని గంటలు చదివాం అన్నది ముఖ్యం కాదు. ఏ రోజు చదివింది.. అదే రోజు రాత్రి రివిజన్ చేసుకోవాలి. ఉదయం పూట చదవడం చాలా మంచిది. కొందరు రోజుకు 14, 16 గంటల పాటు చదివే వారున్నారు. నేనైతే రోజుకు 8 నుంచి 9 గంటల పాటు ఒత్తిడి లేకుండా షెడ్యూలు తయారు చేసుకుని చదివాను. మధ్య మధ్యలో అరగంట పాటు విశ్రాంతి తీసుకున్నా. ఆ సమయంలో ఇష్టమైన పనులు చేసేది. మీరు కూడా ఇలా చేస్తే సరిపోతుంది. కానీ ఒక రోజు చదివి..మూడు రోజులు పుస్తకం పట్టకుండా ఉండొద్దు. దాని వల్ల నష్టమే. పరీక్షలకు నాలుగు నెలల సమయం ఉందటే అన్ని రోజులు చదవాల్సిందే.
శ్రీకాంత్: పుస్తకాలు చదువుతున్నప్పుడు బాగానే ఉంది. సమయానికి గుర్తుకొస్తాయో..లేదో.. అనే నెగెటివ్ ఆలోచన వస్తుంది. ఎలా బయట పడాలి.
* మన మెదడు భూమిలాంటిది. ఎలాంటి విత్తనాలు నాటితే అవే వస్తాయి. నాటకుంటే గడ్డి మొలకెత్తుతుంది. ఏకాగ్రతతో, పాజిటివ్ దృక్పథంతో చదివితే చాలు అవే గుర్తుంటాయి. పరీక్ష రాసేటప్పుడు భయాందోళనకు గురికావొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు