ప్రజావేదన.. పరిష్కారం చూపాలిక..!
జిల్లా పాలనాధికారి సీహెచ్.శివలింగయ్య అధ్యక్షతన కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ హమీద్ ప్రజా సమస్యలను స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు.
విద్యా సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా పాలనాధికారి శివలింగయ్య, చిత్రంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు
జనగామ అర్బన్, న్యూస్టుడే: జిల్లా పాలనాధికారి సీహెచ్.శివలింగయ్య అధ్యక్షతన కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ హమీద్ ప్రజా సమస్యలను స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. వినతుల విషయంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా చూడాలని పాలనాధికారి ఆదేశించారు. మొత్తం 46 అర్జీలు అందజేయగా ఇందులో 26 భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి.
అర్జీల్లో కొన్ని ఇలా..
* లింగాలఘనపురం మండలం చీటూరుకు చెందిన దివ్యాంగులు కలమ్మ, బుచ్చమ్మ రుణం మంజూరు చేస్తే దుకాణం పెట్టుకుంటానని దరఖాస్తు అందజేశారు. ః నర్మెట్టకు చెందిన దివ్యాంగుడు గోపగోని శ్రీనివాస్గౌడ్ తనకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ఇదే మండలానికి చెందిన ఐలేని కృష్ణారెడ్డి తనకు చెందిన 4.26 ఎకరాల భూమిలో అరెకరం భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. ః స్టేషన్ఘన్పూర్కు చెందిన రడపాక బంగారు నాని ఉపాధి కోసం ఏదైన రుణం ఇప్పించాలన్నారు. ః దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన మేడ సుధాకర్ అనే దివ్యాంగుడు ఎస్సీ కార్పొరేషన్ కింద చెప్పుల దుకాణం పెట్టుకునేందుకు రుణం మంజూరు చేయాలని కోరారు.
ప్రేమించి, పెళ్లాడి వద్దంటున్నాడు
- చీకటి దివ్య, లింగంపల్లి, బచ్చన్నపేట
ఆమ్రాజ్ సంపత్ నన్ను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పెళ్లయ్యాక నెల రోజులు బాగానే ఉండి, ఇప్పుడు వేధిస్తూ ఇంటి నుంచి బయటకు పంపించాడు. నన్ను చంపేస్తామని నా భర్త, అత్త, మరిది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణికి వచ్చాను. నా భర్తకు కౌన్సెలింగ్ ఇప్పించాలని అదనపు కలెక్టర్ డీడబ్ల్యూవోకు చెప్పారు.
మీసేవకు వెళ్లమంటున్నారు..
- నల్ల లక్ష్మయ్య, నెల్లుట్ల, లింగాలఘనపురం
నా పేరు మీద లింగాలఘనపురం శివారులో సర్వే నెం.228లో 6.38 ఎకరాల భూమి ఉంది. పట్టా పుస్తకంలో మాత్రం సర్వే నెం.232 అని తప్పు పడింది. దీనిని సవరించాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే మీసేవకు వెళ్లి చేసుకోమంటున్నారు. అక్కడికి వెళ్తే ఇంకా సవరించుకునే అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. భూమి రికార్డులను పరిశీలించి మీసేవ పహాణి, 1బి, పట్టా పుస్తకంలో సర్వే నంబర్ను సవరించాలని వేడుకుంటున్నా.
గ్రామంలో నాణ్యతలేని పనులు
- కోట వెంకన్న, ఎదునూతుల, కొడకండ్ల
మా గ్రామంలో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న మురుగునీటి కాల్వ, సీసీరోడ్లు నాణ్యతగా ఉండడం లేదు. హరితహారం, శ్మశానవాటిక పనులు సక్రమంగా చేయడం లేదు. సర్పంచి గ్రామంలో లేకున్నా ఆయన భర్త ఫోర్జరీ సంతకాలతో చేస్తూ నిధులు డ్రా చేస్తున్నారు. దీనిపై మా గ్రామస్థులు గతంలో కూడా ఫిర్యాదు చేశారు. ఈ రోజు కూడా మా గ్రామస్థులతో కలిసి నాణ్యతలేని పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో దర్యాఫ్తు జరిపించాలని కోరాం.
పోచమ్మ గుడిని కాపాడాలంటూ..
పాలకుర్తిలోని షెడ్యూల్డ్ కులాల వారి పోచమ్మ గుడి స్థలాన్ని కాపాడాలంటూ ఆ గ్రామానికి చెందిన పలువురు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. పట్టాదారైన వీరమన్నేని లక్ష్మినర్సయ్య పోచమ్మ గుడిని నిర్మించుకునేందుకు 12 గుంటల భూమిని ఇచ్చారు. ఆయన మరణాంతరం వారి కుమారుడైన వీరమన్నేని కమలాకర్రావు 1975లో రోడ్డు విస్తరణలో పోగా మిగిలిన ఏడు గుంటల భూమిని గుడి నిర్మించుకునేందుకు భూదాన పత్రం రాసి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని పలువురు కొనుగోలు చేశామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
శాఖల వారీగా దరఖాస్తులు..
డీపీవో : 7
పురపాలిక : 5
పోలీస్ : 3
ఆర్డీవోల పరిధిలోనివి: 6
తహసీల్దార్ల రిధిలోనివి: 16
ఎస్సీ కార్పొరేషన్ : 2
‹ఖ : 2
ఇతర : 5
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్