వర్సిటీలో రూ.45 కోట్లతో అభివృద్ధి
తన ఏడాది పాలనా కాలంలో అందరి సహకారంతో కాకతీయ విశ్వవిద్యాలయాలన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానని ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సెనెట్హాల్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘
కేయూ క్యాంపస్, న్యూస్టుడే: తన ఏడాది పాలనా కాలంలో అందరి సహకారంతో కాకతీయ విశ్వవిద్యాలయాలన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానని ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్ అన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సెనెట్హాల్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘గతంలో లేని విధంగా రూ.27 కోట్లను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంటు కింద తీసుకువచ్చాం. నాలుగేళ్లుగా నిలచిపోయిన పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాం. బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించాం. 49 మంది అధ్యాపకులకు సహా ఆచార్యులుగా, ఆచార్యులుగా పదోన్నతి లభించింది. ఈ ఏడాది జులై స్నాతకోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. పోటీపరీక్షార్థులకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. పరిశోధనా, సదస్సుల నిర్వహణకు పీవీ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మహిళా వసతి గృహాలను నిర్మించడంతో పాటు మహిళా అధ్యాపకులకు కీలకమైన పదవులను అప్పగించాం. కొవిడ్ కాలంలో బోధనకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నాం. వర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మిస్తాం. బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీకి నా వంతు కృషి చేస్తా. అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీలను నిర్వహిస్తా’మన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య వెంకట్రాంరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య మల్లారెడ్డి, దూరవిద్యాకేంద్రం సంచాలకులు ఆచార్య శ్రీనివాసరావు, అభివృద్ధి అధికారి ఆచార్య రామచంద్రం, సీడీసీ డీన్ ఆచార్య డేవిడ్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం పాలకమండలి సభ్యులకు సాధించిన అభివృద్ధిని వివరించగా వారు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా