logo

‘రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించాలి’

రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని పూరేడుపల్లి, బుచ్చంపేట, నర్సాయిగూడెం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమాల్లో

Published : 24 May 2022 04:17 IST

రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సీతక్క

మంగపేట,న్యూస్టఉడే: రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని పూరేడుపల్లి, బుచ్చంపేట, నర్సాయిగూడెం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు రచ్చబండ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని ప్రజలు ఆదరించాలన్నారు. కొట్లాడి సాదించుకున్న తెలంగాణలో రైతులకు కేసీఆర్‌ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన.. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, ఉచితంగా ఎరువులు, విత్తనాల పంపిణీ తదితర హామీలను కేసీఆర్‌ విస్మరించారన్నారు. కార్యక్రమంలో  కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజరి సురేందర్‌, మండల ప్రధాన కార్యదర్శులు యానయ్య, సాంబశివరావు, సహకారసంఘం డైరెక్టర్‌ బాలకృష్ణ, నాయకులు చాద మల్లయ్య, పెద్దినర్సింహరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని