ఓరుగల్లును మరోసారి ముంచొద్దు
2020 సెప్టెంబరు నెలఖారులో నాలుగు రోజుల పాటు వరంగల్ త్రినగరాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. 45 కాలనీలు నీట మునిగాయి. 25 వేల మంది ఇళ్లు ఖాళీ చేసి సహాయ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.
వచ్చేది వర్షాకాలం.. ముందస్తు చర్యలే శ్రీరామరక్ష
కార్పొరేషన్, న్యూస్టుడే
2020 సెప్టెంబరు నెలఖారులో నాలుగు రోజుల పాటు వరంగల్ త్రినగరాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. 45 కాలనీలు నీట మునిగాయి. 25 వేల మంది ఇళ్లు ఖాళీ చేసి సహాయ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.
వరంగల్ నగరంలో ముంపు సమస్యే ఉండొద్దు.. శాశ్వత ప్రణాళికలు రచించాలి. ప్రధాన నాలాలు విస్తరించి.. ఇరువైపులా గోడలు కట్టాలి. ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదు.. వరంగల్కు ముంపు లేకుండా చూడాలి.
- 2020 అక్టోబరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
వరంగల్ మహా నగరం.. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. ఏటా వరద ముంపు ఎక్కువవుతోంది. శివారు వరదనీరు నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. మళ్లీ వర్షాకాలం సమీపించింది. ఈసారి ఏమవుతుందోననే ఆందోళన నెలకొంది.
ఇదీ పరిస్థితి.. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ముంపు నివారణకు రూ.258 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రూ.180 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రెండేళ్లవుతున్నా ఒక్క పని పూర్తవ్వలేదు. అధికారుల నిర్లక్ష్యంతో నాలాల విస్తరణ, గోడలు కట్టే పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
ఇది అత్యంత ప్రమాదకారి..
బొందివాగు నాలా అత్యంత ప్రమాదకరం. 1.50 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. భారీ వర్షాలు పడితే 15-20 వేల క్యూసెక్కుల వరదనీరు పారుతుంది. బెస్తం చెరువు, మద్దెలకుంట, ఉర్సు చెరువు, భట్టుపల్లి, న్యూశాయంపేట కోటి చెరువు మత్తడి పోస్తే వరదనీరంతా నేరుగా బొందివాగు నాలాకు వస్తాయి. హంటర్రోడ్, ఎన్టీఆర్నగర్, సాయినగర్, సంతోషిమాత కాలనీ, గాయత్రినగర్, భద్రకాళినగర్, రామన్నపేట బీసీ కాలనీ, రఘునాథ్కాలనీలకు ముంపు సమస్య ఉంటుంది.
* ఇలా చేయాలి: 110-120 అడుగులు విస్తరించాలి. భద్రకాళి చెరువు వద్ద ఫ్వలింగ్ షట్టర్లు ఏర్పాటు చేయాలి.
2021 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. 30 కాలనీలు నీటమునిగాయి. 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నయీంనగర్ నాలా
హనుమకొండ వడ్డేపల్లి, గోపాల్పూర్ చెరువులు నిండితే పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జవహార్నగర్, 100 ఫీట్ల రోడ్డు, సమ్మయ్యనగర్, రాజాజీనగర్, నయీంనగర్, పోచమ్మకుంట మీదుగా కెనాల్ వరకు సుమారు 5.50 చదరపు కిలో మీటర్లు విస్తరించింది.
* నాలా విస్తరణ 50 శాతం పూర్తయింది. ప్రెసీడెన్సీ స్కూల్ దగ్గర కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి.
వరంగల్ భద్రకాళి నాలా: కేఎంజీ పార్కు నుంచి సరస్వతికాలనీ, రంగంపేట, ములుగురోడ్, అలంకార్, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ వరకు సుమారు 3.63 చదరపు కిలో మీటర్ల విసీˆ్తర్ణంలో ఉంటుంది. బొందివాగు, హంటర్రోడ్ 12 మోరీల నాలా, పోతననగర్ భద్రకాళి మత్తడి ద్వారా వరదనీరు వస్తుంది. 12-15 వేల క్యూసెక్కుల వరదనీరు పారుతోంది. ఐదారేళ్లుగా ప్రమాదకరంగా మారింది. రంగంపేట, సరస్వతి కాలనీ, భద్రకాళిరోడ్, పోతననగర్, ములుగురోడ్ నీట మునుగుతోంది.
* 50-60 అడుగులు విస్తరించారు. ఇరువైపులా గోడలు కట్టాలి.
అన్నీ ఆక్రమణలే: కరీమాబాద్ సాకరాశికుంట నాలాను కుదించేశారు. ఇరువైపులా అన్నీ ఆక్రమణలే. ఏకశిలానగర్, ఎస్ఆర్ఆర్ తోట మీదుగా హంటర్రోడ్ బొందివాగు నాలా వరకు 1.50 చదరపు కిలో మీటర్లు ఉంటుంది.
* 40 అడుగులు విస్తరించాలి.
వరంగల్ రైల్వేగేటు నాలాకు కొత్త సమస్య వచ్చి పడింది. మూడో రైల్వేలైన్ పనులతో దీన్ని కుదించారు. దీంతో వచ్చే వర్షాకాలం దీంతో ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు.
* హనుమకొండ సమ్మయ్యనగర్, నయీంనగర్ నాలాల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపనలు జరిగినా పనులు మొదలవ్వలేదు.
కాజీపేట బంధం చెరువు: కాజీపేట, హనుమకొండ ప్రాంతాల్లోని వరదనీరంతా నేరుగా బంధం చెరువు నాలాలోకి వెళ్తాయి. సుమారు 1.50 చదరపు కిలో మీటర్లు ఉంటుంది.
* రామకృష్ణ కాలనీ నుంచి బంధం చెరువు వరకు నాలా విస్తరించాలి.
చిన్నవడ్డేపల్లి నాలా: దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువు నాలా ప్రమాదకరమే. సుమారు 1.80 చదరపు కిలో మీటర్లు ఉంటుంది. ఇది ఇరుకుగా ఉంటుంది.
* 40-50 అడుగులు విస్తరించాలి.
ఏం చేయాలంటే..
* నాలాల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి. లోతు పెంచాలి. వరదనీరు సాఫీగా వెళ్లేలా పిచ్చి చెట్లు, వ్యర్థాలు తొలగించాలి. చుట్టూ గోడలు కట్టాలి.
* 66 డివిజన్లలో అంతర్గత డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టాలి.
* 45 ముంపు కాలనీలు గుర్తించారు. ముందస్తుగా కచ్చ కాల్వలు తీయాలి.
* దిగువున ఉన్న కాలనీల్లో మట్టి నింపాలి.
* నగర శివారు నుంచి వచ్చే వరదనీరు సాఫీగా బయటకు వెళ్లేలా చూడాలి.
* ప్రధాన డ్రైనేజీల ఇన్, అవుÆట్లెట్లు క్లియర్ చేయాలి.
* ముంపు కాలనీల్లో నాలుగు నెలల పాటు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
నగరవాసి మాట: హంటర్రోడ్ బొందివాగు నాలా అత్యంత ప్రమాదకరం. దీన్ని విస్తరించి చుట్టూ గోడలు కట్టాలి. భద్రకాళి చెరువు దగ్గర ఫ్వలింగ్ షట్టర్లు పెద్దవి ఏర్పాటు చేయాలి. - మర్రి రవీందర్, హంటర్రోడ్
పాలకుల హామీ: నాలాల విస్తరణపై దృష్టి సారించాం. పనులు వేగవంతం చేస్తాం. వర్షాకాలం ప్రారంభంలోపు పూర్తి చేసి ఈ వర్షాకాలం ముంపు సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం - మేయర్ సుధారాణి
అంకెల్లో వివరాలు..
నగరం విస్తీర్ణం
407 చదరపు కిలో మీటర్లు
డ్రైనేజీ వ్యవస్థ
1433.02 చ.కి.మీ
ప్రధాన నాలాల విస్తీర్ణం
54.58 చ.కి.మీ
ఒక మీటరు మురుగు కాల్వలు
151.06 చ.కి.మీ
పక్కా డ్రైనేజీ
882.21 చ.కి.మీ
కచ్చ కాల్వలు
344.27 చ.కి.మీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.