రుణాల పేరుతో మోసం.. ముఠా అరెస్టు
బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్క్రైం, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గురువారం కమిషనరేట్లో సీపీ తరుణ్జోషి నిందితుల వివరాలను వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్ అజంఘడ్కు చెందిన
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ఫోన్లు
వరంగల్క్రైం, న్యూస్టుడే: బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్క్రైం, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. గురువారం కమిషనరేట్లో సీపీ తరుణ్జోషి నిందితుల వివరాలను వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్ అజంఘడ్కు చెందిన మనోజ్ సైస్వాల్, జ్ఞానేంద్ర యాదవ్, బిహార్కు చెందిన రాజ్కుమార్లు ముఠాగా ఏర్పడి రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీరిని అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.07 లక్షల నగదును నాలుగు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియా బుల్స్ పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించారు. పున్నెలు గ్రామానికి చెందిన బొంత రవీందర్ ఇది అసలైన వెబ్సైట్ అనుకొని రుణం కోసం ప్రయత్నించాడు. వెంటనే ఇండియా బుల్ మేనేజర్ పేరుతో వ్యక్తి పరిచయం చేసుకొని రుణం కోసం రూ.1.36 లక్షల ఆన్లైన్ ద్వారా ఇతర ఖాతాల్లోకి మళ్లించాడు. ఎన్నిరోజులు గడిచినా రుణం రాకపోవడంతో ఐనవోలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఐనవోలు ఎస్సై భరత్ ప్రత్యేక పోలీసు బృందంతో బిహార్, ఉత్తర్ప్రదేశ్కు వెళ్లి నిందితులను పట్టుకొని డబ్బులు స్వాధీనం చేసుకొని అక్కడి కోర్టులో హాజరుపర్చి వరంగల్ పోలీసు కమిషరేట్కు తీసుకొని వచ్చారు. సైబర్ నేరాలకు పాల్పడేందుకుగాను నిందితులు ఉపయోగించే సెల్నెంబర్లు, బ్యాంక్ ఖాతాలు, యూపీసీ వివరాలపై పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ విచారణ అనంతరం నిందితులను వరంగల్ కోర్టులో హాజరుపర్చారు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కబనర్చిన ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూర్ ఏసీపీ నరేష్కుమార్, పర్వతగిని సీఐ విశ్వేశ్వర్, ఐనవోలు ఎస్సై భరత్, ఏఏవో సల్మాన్పాషా, ఏఎస్సై శర్మ, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, అన్వర్, రాకేశ్తో పాటు పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.
వివరాలు వెల్లడిస్తున్న సీపీ తరుణ్జోషి, చిత్రంలో డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ నరేశ్కుమార్, ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, పోలీసు సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.