నష్టాల గనులు
భూపాలపల్లి సింగరేణి ఏరియా నష్టాల్లో కొనసాగుతోంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతోంది. భూగర్భ బొగ్గు గనులు గుదిబండగా మారాయి. ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుండటం.
-కోల్బెల్ట్, న్యూస్టుడే
భూపాలపల్లి సింగరేణి ఏరియా నష్టాల్లో కొనసాగుతోంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతోంది. భూగర్భ బొగ్గు గనులు గుదిబండగా మారాయి. ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుండటం.. అందుకు తగట్టు వెలికితీత చేయకపోవడంతో లాభాల దరిచేరలేకపోతున్నాయి. ఉపరితల గనులతో కొంత నష్టాలను పూడ్చుకోవాల్సి వస్తోంది. ఏరియాలో నాలుగు భూగర్భ, రెండు ఉపరితల గనులున్నాయి. ఇందులో 5648 మంది కార్మికులు పని చేస్తున్నారు. అన్ని గనుల్లో రోజుకు 13,560వేల టన్నుల నిర్దేశిత లక్ష్యం ఉంది. కానీ 6,860 టన్నులే వెలికితీస్తున్నారు.
కారణాలు ఇవే!
ఏరియాలో బొగ్గు ఉత్పత్తిలో పుంజుకోవడంలేదు. ఇక్కడి గనుల్లో గ్రేడియంట్(ఎత్తు పల్లాలు) ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎస్డీఎల్స్ యంత్రాల పనితీరు అనుకున్న మేరకు ఉండటం లేదు. ఒక్కో యంత్రం 100 టన్నుల బొగ్గు తీయలేకపోతుంది. గనుల్లో పేల్చివేతలకు ఉపయోగించే మందుగుండు కొరత ఏర్పడింది. రోజుకు 200 టన్నులు కావాలి. మరో వైపు కార్మికుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉంది. గతంలో 18 శాతం ఉండగా, ఇప్పుడు 32 శాతానికి చేరుకుంది. ఓసీపీ-2కు సంబంధించిన భూమి సకాలంలో కంపెనీకి అందుబాటులోకి రాలేదు. ఓసీపీ-3కి గతేడాది నుంచి కావాల్సిన భూమి స్వాధీనం కాలేకపోయింది. ఫలితంగా ఉత్పత్తిపై ప్రభావం పడింది.
వ్యయం ఎక్కువ
భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువవుతోంది. టన్ను తీయడానికి రూ.7,000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. టన్ను బొగ్గు మార్కెట్లో విక్రయిస్తే రూ.3,500 వరకు వస్తుంది. అమ్మకం ధర కంటే ఉత్పిత్తి ధర రెట్టింపు ఉంది. ఉపరితల గనిలో టన్ను ఉత్పత్తికి రూ.800 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతోంది. విక్రయించడం ద్వారా సింగరేణికి రూ.1500 నుంచి రూ.2000 వరకు లాభం వస్తోంది. ఈ లాభాలతో ఏరియాలో కొంత మేరకు నష్టాలు తగ్గుతున్నాయి.
కొత్త ప్రణాళికతో ముందుకు..
- సుబ్బారావు, సింగరేణి జీఎం
నష్టాల నుంచి గట్టెకడానికి కొత్త ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. భూగర్భ గనుల్లో బొగ్గు వెలికితీత పెంచుతాం. వ్యయం తగ్గించడానికి చర్యలు చేపడతాం. ఉపరితల గనుల్లో ఉత్పత్తి మరింత సాధిస్తాం. నిర్దేశిత రవాణా లక్ష్యం అధిగమిస్తాం. కార్మికుల గైర్హాజరు లేకుండా చేస్తాం. ఈ ఏడాది లక్ష్యం చేరుకొని నష్టాల్లో నుంచి బయటపడతామనే నమ్మకం ఉంది. ఇందుకు ఉద్యోగుల కృషి చాలా అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?