logo

వరంగల్‌లోని రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం.. రూ.50లక్షల ఆస్తినష్టం!

నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరంగల్‌ చౌరస్తా శివ మాన్షన్‌ భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న మను రెస్టారెంట్‌లో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

Published : 27 May 2022 10:50 IST

వరంగల్‌ (మట్టెవాడ): నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వరంగల్‌ చౌరస్తా శివ మాన్షన్‌ భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న మను రెస్టారెంట్‌లో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భవనం నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపుచేశారు. రెస్టారెంట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని వరంగల్‌ డివిజన్‌ అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి భగమాన్‌ రెడ్డి అన్నారు. సుమారు రూ.50 లక్షలు వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. షాపింగ్‌ మాల్స్‌ ఉన్న ఒకటి, రెండు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించకపోవడంతో భారీగా ఆస్తినష్టం తప్పిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని