logo

విత్తన దుకాణాలపై పోలీసుల దాడులు

నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది నర్సంపేటలోని విత్తన దుకాణాలపై శుక్రవారం దాడులు చేశారు.

Updated : 27 May 2022 16:24 IST

నర్సంపేట: నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, సీఐ రమేశ్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది నర్సంపేటలోని విత్తన దుకాణాలపై శుక్రవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని అన్ని రకాల విత్తనాలను తనిఖీ చేశారు. నిల్వలు, అమ్మకాల వివరాలను పరిశీలించారు. అనుమతిలేని నాసిరకం విత్తనాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఏసీపీ సంపత్‌రావు హెచ్చరించారు. విత్తనాలు విక్రయించిన తర్వాత రసీదులు ఇవ్వాలని, వాటిపై విత్తనాల వివరాలు, బ్యాచ్‌, లాట్‌ నంబర్లు నమోదు చేయాలని, రైతుల నుంచి సంతకాలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని