రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిద్దాం
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ పాలనకు చమరగీతం పాడి రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిద్దామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్
కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్దాస్ అథావాలేను గజమాలతో సత్కరిస్తున్న ఆర్పీఐ నాయకులు
ఎన్జీవోస్కాలనీ, నిట్ క్యాంపస్ న్యూస్టుడే: పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ పాలనకు చమరగీతం పాడి రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమిద్దామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథావాలే అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఓరుగల్లుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వర్కిగ్ ప్రెసిడెంట్ పసుల రవికుమార్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల జాతికే స్వాతంత్య్రం వచ్చిందని, ఇప్పటికి దళితులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తమ పార్టీకి రాష్ట్రంలో పది నుంచి పదిహేను స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బ్రహ్మనందరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించడం సరికాదన్నారు. తొలుత కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్నేహలత, ప్రధాన కార్యదర్శి జ్యోతిరమణ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
అందరి సంక్షేమం కోసమే కేంద్ర పథకాలు..
నిట్ క్యాంపస్, నదేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె పేర్కొన్నారు. తొలుత నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకోగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపి, సీపీ డాక్టర్ తరుణ్ జోషి, అధికారులు స్వాగతం పలికారు. నిట్ కళాశాలలో ప్రభుత్వ శాఖల అధికారులతో కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల్, ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, తదితర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పారదర్శకంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పక్కాగా పథకాలు అందేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్, శ్రీవత్స అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.