పీఎం స్వనిధి రుణం.. వీధి వ్యాపారులకు వరం..
వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి, ఆత్మ నిర్బర్ పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్ల
భూపాలపల్లి, న్యూస్టుడే: వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి, ఆత్మ నిర్బర్ పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులను గట్టక్కించేందుకు బ్యాంకుల ద్వారా రూ.10 వేలు మంజూరు చేశారు. మొదట్లో కొందరే ముందుకురాగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మెప్మా ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగారు. వీధి వ్యాపారం చేసే చోటుకు వెళ్లి వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో ఎక్కువ మందికి రుణాలు అందించారు.
రెండో విడతకు చర్యలు..
మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులకు రెండో విడతలో రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికే రెట్టింపు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడతలో రుణాలు తీసుకొని వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. అర్హులుగా సగం మంది కూడా తేలకపోగా, తీసుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు మళ్లీ రుణం పొందేందుకు అవకాశం కల్పించారు. కొంత మంది లబ్ధిదారులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆత్మనిర్బన్ పథకం ద్వారా రూ.20 వేలు రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది.
ఎంతమందికి లబ్ధి అంటే..
భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 3,186 మంది వీధి వ్యాపారులుండగా.. వీరిలో 2,445 మంది రుణాల కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. మొదటి విడతలో 1,974 మందికి లబ్ధి చేకూరగా, రెండో విడత వచ్చే సరికి ఆ సంఖ్య తగ్గింది. ఇందులో 1,030 మందికి రుణం మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 194 మంది ఖాతాల్లో జమయ్యాయి. రెండో విడత రుణాలు మంజూరు చేసేందుకు మెప్మా అధికారులు, ఆర్పీలు, సిబ్బంది కృషిచేస్తున్నారు. గడువు ప్రకారం రుణాలు అందిస్తే చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.
రుణాల మంజూరు వివరాలు..
మున్సిపాలిటీ పేరు
భూపాలపల్లి
వీధి వ్యాపారులు 3,186
మొదటి విడత మంజూరు 1,974
రెండో విడత.. 1,030
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి