ఈసారీ పాఠ్య పుస్తకాలు ఆలస్యమే..
పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా కనిపించడం లేదు. ఏటా మూడు నెలల ముందు నుంచే పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి.
మరో 16 రోజుల్లో ప్రారంభం కానున్న బడులు
భూపాలపల్లి, న్యూస్టుడే: పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా కనిపించడం లేదు. ఏటా మూడు నెలల ముందు నుంచే పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖకు పుస్తకాలు రాలేదు. దీంతో సమయానికి విద్యార్థులకు పుస్తకాలందడం అనుమానమే. 2019 నుంచి ప్రభుత్వం ముందస్తుగా పాఠ్యాంశాల ముద్రణ ప్రారంభించి, విద్యా సంవత్సరం ముగింపులోనే అంటే మార్చిలో రానున్న విద్యా సంవత్సరానికి సరఫరా ప్రారంభించేది. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఎంఆర్సీలకు తరలించి, మొదటి రోజే విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందించే వారు. కొవిడ్ సమయంలోనూ జాప్యం జరగలేదు. ఈసారి మాత్రం మొదటిరోజు అందించడంపై అనుమానాలు నెలకొన్నాయి.
అన్నీ రాకుంటే గత సమస్యలే..
పూర్తిస్థాయిలో పుస్తకాల సరఫరా కాకపోతే గత సమస్యలే మొదలయ్యే అవకాశం ఉంది. గతేడాది పాఠ్యపుస్తకాలు ముందుగా వచ్చినా.. కొన్ని తరగతులకు రాలేదు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు 50 శాతమే వచ్చాయి. హిందీ పాఠ్యపుస్తకాల కొరత కనిపించింది. దీంతో చదువుకునేందుకు ఉన్నత తరగతుల విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఈసారైనా పూర్తిస్థాయిలో అందేలా విద్యాశాఖ అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో అవసరం ఇలా..
యూడైస్ ఆధారంగా ఒక్కో విద్యార్థికి తరగతిని బట్టి 5 నుంచి 11 పుస్తకాలు అవసరం. 2021-22 యూడైస్ ప్రకారం జిల్లాలో 468 పాఠశాలల్లో 42,381 మంది విద్యార్థులకుపైగా చదువుకుంటున్నారు. వీరందరికీ కలిపి సుమారు 1,60,080 పాఠ్యపుస్తకాలు అవసరం. రాష్ట్రస్థాయిలో పుస్తకాల ముద్రణ పూర్తి కాకపోవడంతో జిల్లాకు చేరుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
మార్పులతో జాప్యం..
- శ్రీనివాస్రెడ్డి, డీఈవో, భూపాలపల్లి
జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఈసారి ఇంకా చేరుకోలేదు. గతంలోనే విద్యార్థుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. దాని ఆధారంగా పుస్తకాలు రావాల్సి ఉంది. ఆంగ్లం, తెలుగు మాధ్యమం పుస్తకాల ముద్రణలో మార్పులు చోటు చేసుకోవడంతో జాప్యం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నా.. త్వరలోనే పుస్తకాలు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్