మావంటే.. మావే!!
మహాముత్తారం శివారులో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న 487 సర్వే నంబర్లోని భూముల్లో బోరు బావులు తవ్వారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఇటీవల ప్రభుత్వం ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తోంది.
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం
●పోడు భూముల్లో బోరుబావులు తవ్వించారని కేసు నమోదు
మహాముత్తారం(జయశంకర్ జిల్లా), న్యూస్టుడే: మహాముత్తారం శివారులో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న 487 సర్వే నంబర్లోని భూముల్లో బోరు బావులు తవ్వారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఇటీవల ప్రభుత్వం ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తోంది. అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాటి సాగుకోసం కోసం 487 సర్వే నెంబర్లో వివాదాస్పదంగా ఉన్న భూముల్లో బోరు బావులు తవ్వుకుంటుండగా ఆజాంనగర్ రేంజి అటవీశాఖ అధికారులు గత గురువారం అడ్డుకున్నారు. ఈ తరుణంలో మహాముత్తారం తహసీల్దార్ మాధవి, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ వెళ్లి.. అవి రెవెన్యూ భూములని, రైతులకు పట్టాలిచ్చామని, బోరు బావుల తవ్వకానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు. రెండు రోజుల్లో ఎనిమిది బావులు తవ్వారు. వివాదం మరింత జఠిలమైంది. పోడు భూముల్లో అక్రమంగా బోరుబావుల తవ్వకానికి సహకరిస్తున్నారని తహసీల్దార్ మాధవి, డిప్యూటీ తహసీల్దార్ సందీప్పై కేసు (ప్రాథమిక నేర నివేదిక) నమోదు చేసి కోర్టుకు సమర్పించినట్లు ఆజాంనగర్ ఇన్ఛార్జి అటవీక్షేత్రాధికారి కిరణ్ పేర్కొన్నారు. విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈవిషయమై మాధవిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా నిబంధన ప్రకారమే నడుచుకుంటున్నామని, ఇక్కడి భూముల్లో గతంలో తవ్విన బోరుబావులు పదుల సంఖ్యలో ఉన్నాయని, అప్పుడు అడ్డుపడని అటవీశాఖ అధికారులు ప్రస్తుతం పోడు భూములని అనడం ఏమిటని ప్రశ్నించారు.
నలుగుతున్న వివాదం
ఈ భూములు ఏళ్లుగా వివాదాస్పదంగానే ఉన్నాయి. భూప్రక్షాలనలో భాగంగా 487 సర్వే నంబర్కు అక్రమంగా బైనంబర్లు సృష్టించి అప్పటి రెవెన్యు సిబ్బంది పట్టాలు చేశారని అటవీశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ రికార్డుల ప్రకారం కాంపాట్మెంట్ నంబర్ 716లోని పోడు భూములని చెబుతున్నారు. మరో వైపు అటవీ స్థలాలు కావని రెవెన్యూ అధికారులు వాధిస్తున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, సంయుక్త సర్వే చేయకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా