మనసు వికలమై.. బతుకు భారమై!
నిండునూరేళ్ల ప్రాయాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. మనసులో ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాల్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఉజ్వలమైన భవిత కళ్లెదుట ఉన్నప్పటికీ.. కాసేపు మనసులో కల్లోలాన్ని సృష్టిస్తున్న వేదన, అలజడిల ముందు ఓడిపోతున్నారు.
క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత
భూపాలపల్లి క్రైం, న్యూస్టుడే : నిండునూరేళ్ల ప్రాయాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. మనసులో ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాల్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఉజ్వలమైన భవిత కళ్లెదుట ఉన్నప్పటికీ.. కాసేపు మనసులో కల్లోలాన్ని సృష్టిస్తున్న వేదన, అలజడిల ముందు ఓడిపోతున్నారు. విలువైన ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. జల్సాలకు దగ్గరై యువకులు.. అప్పుల ఊబిలో చిక్కుకొని పెద్దలు.. ఆవేశంలో మహిళలు.. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరణమే శరణ్యమని భావించి.. చితిరాత రాసుకుంటున్నారు. ఆత్మీయులను శోకసంద్రంలో ముంచుతున్నారు. మారుతున్న జీవన విధాన ఫలితమో.. కుటుంబ సభ్యుల మధ్య బలహీనమవుతున్న బంధమో తెలియదు. కానీ ఈ లోకంలో బతకలేమని తనువు చాలిస్తున్న తీరు మాత్రం విషాదాన్ని నింపుతోంది. జిల్లాలో ఏడాదికేడాది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది.
కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి : సురేందర్రెడ్డి, ఎస్పీ
జీవితంలో ఎదురయ్యే కష్టాలను పెద్ద సమస్యగా భావిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అలా చేయవద్ధు నూరెళ్లు బతకాల్సిన వారు ఆటంకాలు కలిగినప్పుడు, అపజయాలు ఎదురైనప్పుడు బలంగా నిలబడాలి. వాటికి పరిష్కార మార్గాలు అన్వేశించాలి. క్షణికావేశంలో తీసుకున నిర్ణయంతో కుటుంబాలకు తీరని వేదన మిగులుతుంది.
నిపుణుల సలహాలు
* ప్రతి ఒక్కరికీ జీవితంలో ఆటుపోట్లు సహజం. సముద్ర కెరటం ప్రతీసారి పైకిలేచి కిందపడుతుంది. అలానే ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేయాలి.
* జీవితంలో ఓటమి కామా మాత్రమే ఫుల్స్టాప్ కాదు. గెలుపు ఏమీ నేర్పించదు, ఓటమీ గుణపాఠాలు నేర్పిస్తుంది.
* ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో నిత్యం సమయం కేటాయించాలి. వారితో సమస్యలు, బాధలు పంచుకోవాలి.
* ప్రపంచంలో మనషులు తప్ప ఏ జీవి ఆత్మహత్య చేసుకోదు. ఉన్నతమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలనుకోవడం ప్రకృతి విరుద్ధం.
కారణాలు అనేకం
* నచ్చిన చదువు చదవలేక, కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఇష్టంలేని కోర్సులో చేరి దానిలో ఇమడలేక ఇబ్బంది పడే వారు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు.
* కొంత మంది మద్యం, పేకాట, ఇతరత్రా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి రోడ్డున పడుతున్నారు. బతుకు భారమై తనువు చాలిస్తున్నారు.
* సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ధరలోనే అందుబాటులో ఉండటం, అర్ధరాత్రుల వరకు అంతర్జాలానికే అతుక్కుపోవడం, చరవాణులతో గంటలకొద్దీ కాలక్షేపం చేయడం వల్ల దుష్ప్రభావాలు సైతం ఎదురవుతున్నాయి.
* చరవాణి కొనివ్వలేదని, తల్లిదండ్రులు మందలించారని ప్రాణాలు తీసుకుంటున్నారు.
* చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చడం, స్కూళ్లలో సైతం ఈ వికృత పోకడలు పెరిగిపోవడం మరో కారణం.
* ఈనెల 15వ తేదిన భూపాలపల్లి పట్టణానికి చెందిన ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి తన భార్యతో ఓ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యను కత్తితో పొడిచి తాను కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయంతో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది.
* నెలన్నర క్రితం చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి.. అనివార్య కారణాలతో కొలువు పోయిందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
* మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేటకు చెందిన ఓ యువకుడు రెండు నెలల కిత్రం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆవేశంతో చితిరాత రాసుకున్నాడు.
* గణపురం మండలం గాంధీనగర్లోని భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యల కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆవేశంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనువు చాలించిన నవవధువు
విజయ(పాతచిత్రం)
కాటారం మండలం ఒడిపిలవంచలో విజయ(28) నవ వధువు శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం వజినేపల్లి గ్రామానికి చెందిన విజయతో నెల క్రితం ఒడిపిలవంచకు చెందిన శ్రీకాంత్కు వివాహం జరిగింది. ఈనెల 24న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. శ్రీకాంత్ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు రాజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
-న్యూస్టుడే, కాటారం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పాల్గొననున్న ‘ఓరుగల్లు జనజాతర’ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందని లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. -
అభ్యర్థిని చూసి ఆశీర్వదించండి..
[ 24-04-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కు వచ్చిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. -
కేఎంసీకి పోటెత్తిన మహిళా రోగులు
[ 24-04-2024]
కేఎంసీ(కాకతీయ మెడికల్ కాలేజీ)లోని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చేవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మంగళవారం న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ ఓపీ వైద్యసేవల కోసం అతివలు పోటెత్తారు. -
నెగ్గేదెవరైనా.. విమానం తీసుకురావాలి
[ 24-04-2024]
కొన్నేళ్లుగా వరంగల్ మామునూరు విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి తోడ్పడే దీని పునరుద్ధరణ అంశం వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎంతో కీలకం కానుంది. -
నాడు హనుమకొండ.. నేడు భువనగిరి!
[ 24-04-2024]
జనగామ శాసనసభ నియోజకవర్గం గతంలో హనుమకొండ లోక్సభ పరిధిలో ఉండేది. 2009 సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని హనుమకొండ నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పడిన భువనగిరి లోక్సభలో కలిపారు. -
వరంగల్ తొలి ఎంపీ సాదత్ అలీఖాన్
[ 24-04-2024]
1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానం నుంచి హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) అభ్యర్థిగా పోటీ చేశారు. -
అవును.. నిజమే కదా!
[ 24-04-2024]
జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. -
ఓటేయండి.. భవితకు బాటేయండి
[ 24-04-2024]
పోలింగ్ రోజు ప్రతి ఓటరు గడప దాటి ఓటు హక్కు వినియోగించుకోవాలని.. పిల్లల భవితకు బాటలు వేయాలని సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ఓట్లతోనే.. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు..
[ 24-04-2024]
జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ చదువుతుంటాం. ఎన్నికల ప్రచారంలో సైతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. జాతీయ పార్టీలు దిల్లీ నుంచి పాలిస్తాయని.. -
గుర్తుంచుకుందాం..
[ 24-04-2024]
రాజకీయ పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది పార్టీల గుర్తులు. వాటి ఆధారంగానే ఓటు వేస్తుంటాం. మన దేశంలో పార్టీల గుర్తుల కేటాయింపు ఎలా జరిగింది..? జాతీయ పార్టీల గుర్తుల్లో ఎలాంÇటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.. -
అతిథులు తరలిరాగా.. బూర మోగించె!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. -
హేమాచల క్షేత్రంలో పూజలు
[ 24-04-2024]
మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్శర్మలు స్వాగతం పలికారు. -
వారధి.. నిర్లక్ష్యం తీరిది!
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. -
ఏడుగురు అభ్యర్థులు.. 9 నామపత్రాలు
[ 24-04-2024]
వరంగల్ పార్లమెంట్ స్థానానికి మంగళవారం ఏడుగురు అభ్యర్థులు 9 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
[ 24-04-2024]
ఓ వైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండగా అదే తరహాలో సైబర్ మోసాలు విజృంభిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కారణంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగింది. -
రాత్రి వేళల్లో తరలిస్తున్నారు..!
[ 24-04-2024]
జిల్లాలో బెరైటీస్ అక్రమ రవాణా కొనసాగుతోంది. అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా సఫలమవడం లేదు. అధికారుల కళ్లుగప్పి విలువైన ఖనిజాన్ని రాత్రి వేళ సరిహద్దులు దాటిస్తున్నారు. -
సర్కారు బడిలో విజన్-2026
[ 24-04-2024]
డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విజన్-2026 పేరిట ఓ ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన చేశారు. -
బకాయిలు రావు.. పనులు సాగవు..
[ 24-04-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, నూతన నిర్మాణాల పనులకు నిధుల కొరత ఏర్పడటంతో.. సుమారుగా ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. -
భారాస అభ్యర్థి నామపత్రం దాఖలు
[ 24-04-2024]
మహబూబాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి మాలోత్ కవిత మంగళవారం ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ముందుగా కురవి వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
భార్యల సీట్ల కోసం భర్తల కొట్లాట
[ 24-04-2024]
ఆర్టీసీ బస్సులో భార్యల సీట్ల కోసం భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మంగళవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్లో నెలకొంది.