రామగుండం వైపు ఇంటర్సిటీ ఒక్కటే దిక్కు
బల్లార్షా వైపు ప్రయాణించేందుకు ఇప్పుడు హైదరాబాదు-సిర్పూర్ కాగజ్నగర్ల మధ్య నడిచే ఇంటర్సిటీ ఒక్కటే దిక్కయింది. జమ్మికుంట- ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడోలైను పనుల కారణంగా సోమవారం....
బల్లార్షా మార్గంలో రైళ్లు రద్దు కావడంతో బుకింగ్ కౌంటర్ వద్ద ప్రయాణికులు
కాజీపేట, న్యూస్టుడే: బల్లార్షా వైపు ప్రయాణించేందుకు ఇప్పుడు హైదరాబాదు-సిర్పూర్ కాగజ్నగర్ల మధ్య నడిచే ఇంటర్సిటీ ఒక్కటే దిక్కయింది. జమ్మికుంట- ఉప్పల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడోలైను పనుల కారణంగా సోమవారం నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ముఖ్యమైన రైళ్లను రద్దు చేయడమే కాకుండా 12 రైళ్లను దారి మళ్లించారు. సోమవారం ఉదయం నుంచి ఇది అమలులోకి రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సిర్పూర్కాగజ్నగర్-సికింద్రాబాదుల మధ్య నడిచే 12757/58 నంబరు గల కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, కాజీపేట-సిర్పూర్టౌన్ల మధ్య నడిచే 17003/04 నంబరు గల రామగిరి ప్యాసింజరు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. భద్రాచలం రోడ్-బల్లార్షాల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజరు.. భద్రాచలం రోడ్ నుంచి వరంగల్ వరకు మాత్రమే నడుస్తుది. సికింద్రాబాదు- బల్లార్షా మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది. మరో 12 రైళ్లను నిజామాబాద్ మీదుగా దారి మళ్లించారు.
రైలు మార్గంలేక ఇబ్బందులు
బల్లార్షా వైపు ఉన్న రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు వెళ్లాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రోడ్డు, రైలు మార్గమే సులువుగా ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కరీంనగర్ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది చాలా దూరమే కాకుండా అధిక సమయం పడుతుంది. దీంతో ఎక్కువగా ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు రైళ్లనే ఆశ్రయిస్తారు. మూడోలైను పనుల కారణంగా కేవలం ఇంటర్సిటీ (కాజీపేటలో ఉదయం 7.20 గంటలకు) ఒక్కటే ఇప్పుడు అందుబాటులో ఉంది. హైదరాబాదు- న్యూదిల్లీ మధ్య నడిచే తెలంగాణ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది కానీ.. ఇందులో కేవలం నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ రిజర్వేషన్తో ఉంటాయి. సాధారణంగానే తెలంగాణ రైలులో జనరల్ బోగీలు కిక్కిరిసి ఉంటాయి. అందుకే ఇందులో ప్రయాణం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది కేవలం మంచిర్యాల, రామగుండంలో మాత్రమే ఆగుతుంది. మిగతా రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు లేదా అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు ఇంటర్సిటీని మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది.
కాషన్ ఆర్డర్తో నడపవచ్చు
24 రోజుల పాటు ముఖ్యమైన రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కాషన్ ఆర్డర్ లేదా మ్యానువల్గా భాగ్యనగర్ లాంటి డిమాండ్ గల రైళ్లను నడిపించవచ్చని రైల్వే నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పనులను త్వరగా పూర్తి చేసి కాస్త ఆలస్యంగా నడిచినా మరో రైలును నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)