logo

అక్కాచెల్లెళ్లకు భరోసా

పాలకుర్తికి చెందిన ఏదునూరి మల్లేశ్‌ ఆకస్మిక మృతితో వారి కూతుళ్లు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలో ‘విధి పగబట్టి.. నిస్సహాయ స్థితికి చేర్చి’....

Published : 28 Jun 2022 06:16 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: పాలకుర్తికి చెందిన ఏదునూరి మల్లేశ్‌ ఆకస్మిక మృతితో వారి కూతుళ్లు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలో ‘విధి పగబట్టి.. నిస్సహాయ స్థితికి చేర్చి’ అనే శీర్షికతో సోమవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన స్త్రీ సంక్షేమశాఖ అధికారులు తహేరా బేగం, సుజాత వారి నివాసానికి వెళ్లి అక్కాచెల్లెళ్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పించేలా చొరవ తీసుకుంటామని, హైదరాబాద్‌లో చదువుకునేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కొంత సమయం కావాలని వారిద్దరు విన్నవించారు. తహేరా బేగం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. అక్కాచెల్లెళ్ల నిర్ణయం మేరకే తదుపరి చర్యలు తీసుకొని విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని