పరువు తీశారని ప్రాణం తీసుకున్న వివాహిత
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్టుడే, బయ్యారం: తనను వేధించిన వ్యక్తిని మందలించాలని సర్పంచికి ఫోన్లో విన్నవించిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. కుల పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలోనూ న్యాయం జరగకపోగా పరువు తీశారనే అవమానంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముక్తి స్వాతి (38), నాగేశ్వర్రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు కాగితాలపై సంతకం పెట్టించేందుకు ముక్తి స్వాతి పది రోజుల కిందట పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మంగీలాల్ తనను వేధించాడంటూ గ్రామానికి చెందిన యువకుడు చింత అరవింద్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన పంచాయతీ కార్యదర్శిని మందలించడంతో పాటు వాట్సాప్లో దుర్భాషలాడుతూ ఛాటింగ్ చేసి బెదిరించాడు. మరోవైపు బాధితురాలు తనతో పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరును ఫోన్లో సర్పంచి తాటి వెంకన్నకు విన్నవించింది. ఈ సంభాషణ స్వాతి ఫోన్లో రికార్డు అయింది. దీనిని చూసిన అరవింద్ కుల పెద్దలు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్నకు ఆదివారం మధ్యాహ్నం పంపించాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో సర్పంచి, కులపెద్దలు సాయంత్రం 4 గంటలకు పంచాయితీ పెట్టి అరవింద్, అతడి తల్లిదండ్రులు, స్వాతితోపాటు ఆమె ఆడపడుచు సైదమ్మను పిలిపించి మాట్లాడారు. ఈక్రమంలో తన అన్న పరువు ఎందుకు తీస్తున్నావంటూ సైదమ్మ స్వాతిపై చేయి చేసుకుంది. అరవింద్ తల్లి భద్రమ్మ కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావంటూ దాడి చేసింది. ఈ సంఘటనతో కులపెద్దల ఎదుట తన పరువు పోయిందని భావించిన స్వాతి మనవేదనతో ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి సోదరుడు కల్తీ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపతికి తరలించారు. ఈ విషయంపై గార్ల, బయ్యారం సీఐ బాలాజీ మాట్లాడుతూ అరవింద్, భద్రమ్మ, పుల్లయ్య, సైదమ్మపై కేసు నమోదు చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ అసభ్యంగా ప్రవర్తించాడని విచారణలో తేలితే అతడిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ను వివరణ కోరగా కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Varun Gandhi: జెండాల కొనుగోలుకు పేదల తిండి లాక్కోవడమా..?
-
Sports News
Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
-
General News
Telangana News: మళ్లీ విధుల్లోకి ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు
-
Politics News
Payyavula Keshav: చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు: పయ్యావుల
-
Politics News
Bandi Sanjay: తెరాస ప్రభుత్వం బీసీలను అణచివేస్తోంది: బండి సంజయ్
-
General News
Andhra News: రైతుకు దొరికిన వజ్రం.. ఎంతకు అమ్మాడో తెలుసా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..