పరువు తీశారని ప్రాణం తీసుకున్న వివాహిత
తనను వేధించిన వ్యక్తిని మందలించాలని సర్పంచికి ఫోన్లో విన్నవించిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. కుల పెద్దమనుషుల సమక్షంలో....
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్టుడే, బయ్యారం: తనను వేధించిన వ్యక్తిని మందలించాలని సర్పంచికి ఫోన్లో విన్నవించిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం.. కుల పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలోనూ న్యాయం జరగకపోగా పరువు తీశారనే అవమానంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముక్తి స్వాతి (38), నాగేశ్వర్రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు కాగితాలపై సంతకం పెట్టించేందుకు ముక్తి స్వాతి పది రోజుల కిందట పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మంగీలాల్ తనను వేధించాడంటూ గ్రామానికి చెందిన యువకుడు చింత అరవింద్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన పంచాయతీ కార్యదర్శిని మందలించడంతో పాటు వాట్సాప్లో దుర్భాషలాడుతూ ఛాటింగ్ చేసి బెదిరించాడు. మరోవైపు బాధితురాలు తనతో పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరును ఫోన్లో సర్పంచి తాటి వెంకన్నకు విన్నవించింది. ఈ సంభాషణ స్వాతి ఫోన్లో రికార్డు అయింది. దీనిని చూసిన అరవింద్ కుల పెద్దలు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్నకు ఆదివారం మధ్యాహ్నం పంపించాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో సర్పంచి, కులపెద్దలు సాయంత్రం 4 గంటలకు పంచాయితీ పెట్టి అరవింద్, అతడి తల్లిదండ్రులు, స్వాతితోపాటు ఆమె ఆడపడుచు సైదమ్మను పిలిపించి మాట్లాడారు. ఈక్రమంలో తన అన్న పరువు ఎందుకు తీస్తున్నావంటూ సైదమ్మ స్వాతిపై చేయి చేసుకుంది. అరవింద్ తల్లి భద్రమ్మ కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావంటూ దాడి చేసింది. ఈ సంఘటనతో కులపెద్దల ఎదుట తన పరువు పోయిందని భావించిన స్వాతి మనవేదనతో ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి సోదరుడు కల్తీ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వాసుపతికి తరలించారు. ఈ విషయంపై గార్ల, బయ్యారం సీఐ బాలాజీ మాట్లాడుతూ అరవింద్, భద్రమ్మ, పుల్లయ్య, సైదమ్మపై కేసు నమోదు చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ అసభ్యంగా ప్రవర్తించాడని విచారణలో తేలితే అతడిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ను వివరణ కోరగా కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.