‘హద్దులు’ దాటి బెదిరింపులు
గ్రేటర్ వరంగల్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. రాజకీయ అండదండలతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు రెచ్చి పోతున్నారు.
వెంచర్లలోకి అధికారులు రాకుండా అడ్డుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు
కార్పొరేషన్, న్యూస్టుడే
వరంగల్ శివారు స్తంభంపల్లి వ్యవసాయ భూమిలో వెలిసిన వెంచర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. రాజకీయ అండదండలతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు రెచ్చి పోతున్నారు. అనధికారిక లేఅవుట్లు అడ్డుకునేందుకు వెళ్తున్న టౌన్ప్లానింగ్, టాస్క్ఫోర్స్ బృందాలను బెదిరిస్తున్నారు. రెండు రోజుల క్రితం శంభునిపేట శివారులోని విలీన గ్రామంలో అక్రమ లేఅవుట్ హద్దు రాళ్లు తొలగిస్తుండగా అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్, మండల స్థాయి నాయకుడు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిసింది. ఈ వెంచరు ఎవరిదో తెలుసా.. హద్దు రాళ్లు తొలగిస్తే నీ ఉద్యోగం ఉండదంటూ అధికారులను బెదిరించారని తెలిసింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వెంచర్లతో బల్దియా ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. భూ పేరు మార్పిడి, నాలా కన్జర్వేషన్ చేయకుండానే అనధికారిక లేఅవుట్లు చేస్తున్నట్లు తెలిసింది.
విలీన గ్రామాల్లోనే..
* విలీన గ్రామాల్లో చిన్న చిన్న లేఅవుట్లు వందలాదిగా వెలుస్తున్నాయి. 1-3 ఎకరాల భూములు కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు చేస్తున్నారు. అంతర్గత రోడ్లు చూపించి కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాలు, రహదారులు, నీటి సరఫరా తదితర అంశాల ప్రస్తావనే లేదు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎప్పటికైనా భూములు లాక్కుంటారని కొందరు స్థిరాస్తి వ్యాపారాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిసింది. ఔటరు రింగురోడ్డు, గ్రీన్ ఫీీల్డ్ తదితరాల పేరు చెప్పి రైతులను బురిడీ కొట్టిస్తున్నారు.
* స్తంభంపల్లి, వసంతపూర్, వెంకటాపురం, బొల్లికుంట, సింగారం, తిమ్మాపూర్, గాడిపల్లి, దూపకుంట, ఖిలావరంగల్ కోట శివారు, పోతరాజుపల్లి, ధర్మారం, గొర్రెకుంట, మొగిలిచర్ల, పైడిపల్లి, ఆరెపల్లి, హసన్పర్తి, ఎల్లాపూర్, రెడ్డిపురం, గుండ్ల సింగారం, హనుమకొండ వడ్డేపల్లి చెరువు శిఖం, కోమటిపల్లి, దేవన్నపేట, మడికొండ, రాంపూర్, కడిపికొండ, భట్టుపల్లి, అమ్మవారిపేట శివారుల్లో చిన్నాచితక అక్రమ లేఅవుట్లు వెలిశాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం : -వెంకన్న, నగర ప్రణాళికాధికారి, గ్రేటర్ వరంగల్
విలీన గ్రామాల్లో కొందరు స్థిరాస్తి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా చిన్న చిన్న అనధికారిక లేఅవుట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 14 వరకు గుర్తించాం. అన్ని ప్రాంతాల్లో హద్దురాళ్లు తొలగించేశాం. అక్రమ లేఅవుట్ల ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు మోసపోవద్ధు భవిష్యతుతలో ఇబ్బందులు వస్తాయి. అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు