గంజాయి కేంద్రాలుగా వసతిగృహాలు!
ఇటీవల హనుమకొండ ఠాణా నయీంనగర్లో రెండు వసతి గృహల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి సేవిస్తున్న అయిదుగురు విద్యార్థులను పట్టుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ వచ్చారు. గంజాయి సరఫరా చేస్తున్న పాలకుర్తి మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తిని చెందిన అరెస్టు చేశారు. కొంతకాల కిందట రాంనగర్లో కొత్తగూడెం పట్టణానికి చెందిన యువకుడు ఇక్కడ వసతి గృహంలో ఉంటూ గంజాయి విక్రయిస్తుండగా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
ఇటీవల హనుమకొండ ఠాణా నయీంనగర్లో రెండు వసతి గృహల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి సేవిస్తున్న అయిదుగురు విద్యార్థులను పట్టుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ వచ్చారు. గంజాయి సరఫరా చేస్తున్న పాలకుర్తి మండలంలోని ఓ తండాకు చెందిన వ్యక్తిని చెందిన అరెస్టు చేశారు. కొంతకాల కిందట రాంనగర్లో కొత్తగూడెం పట్టణానికి చెందిన యువకుడు ఇక్కడ వసతి గృహంలో ఉంటూ గంజాయి విక్రయిస్తుండగా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
న్యూస్టుడే, వరంగల్క్రైం : నగరం విద్యాహబ్గా మారింది. పేరేన్నికగన్న విద్యాసంస్థలు ఉండటంతోపాటు ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు. ప్రస్తుతం పోటీ పరీక్షల ప్రకటనలతో నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి గదులు అద్దెకు తీసుకుంటుండగా, చాలామంది వసతిగృహాల్లో ఉంటున్నారు. నగరంలో సుమారు 150కి పైగా వసతి గృహాలుండగా వీటిలో కొన్ని మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తున్నాయి. చాలామటుకు నిబంధనలు పక్కనపెట్టి అనుమతిస్తున్నాయి. గంజాయి సరఫరాదారులు విద్యార్థుల వసతిగృహాల్లో ఉంటూ సరఫరా చేస్తున్నారు. తొలుత ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ విద్యార్థులు పరిచయమైన క్రమంలో వారికి కూడా అలవాటు చేస్తున్నారు. నయీంనగర్లోని రెండు వసతి గృహాల్లో అయిదుగురు విద్యార్థులు, సరఫరాదారుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు వసతి గృహాలకు నగర పాలక సంస్థ అనుమతులే లేవని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి వాటి రద్దుకు సిఫార్సు చేశారు.
సమావేశం ఏర్పాటు చేస్తాం.. : - కిరణ్కుమార్, హనుమకొండ ఏసీపీ
వసతి గృహంలోఉన్న వారి పూర్తి సమాచారం నిర్వాహకుల వద్ద లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.వాటి పరిసర ప్రాంతాల్లో నిఘా పెడుతున్నాం. త్వరలో వసతి గృహాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. మత్తు పదార్థాలకు బానిసలైన వారి వివరాలను పోలీసులకు ఇస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెస్తాం.
కమిషనరేట్లో గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలు నివారించేందుకు సీపీ డాక్టర్ తరుణ్జోషి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. రెండు రోజుల కిందట అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీలు పోటీలు నిర్వహించారు. యువత మత్తుకు బానిస కావద్దంటూ వారిలో చైతన్యం, ఉత్సాహం కలిగించేలా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వసతిగృహాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి