జడ్పీ కార్యాలయానికి భవనమేదీ?
జడ్పీ ఛైర్పర్సన్ పాగాల సంపత్రెడ్డి అధ్యక్షతన నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. మూడు మాసాలకోసారి జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులతో పాటు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కావాల్సి ఉంటుంది.
నిరుపయోగంగా ఉన్న డీపీఆర్సీ భవనం
జనగామ, న్యూస్టుడే: జడ్పీ ఛైర్పర్సన్ పాగాల సంపత్రెడ్డి అధ్యక్షతన నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనుంది. మూడు మాసాలకోసారి జరిగే సమావేశానికి అన్ని శాఖల అధికారులతో పాటు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరు కావాల్సి ఉంటుంది. సుమారు 30 శాఖలకు సంబంధించిన అజెండా అంశాలపై చర్చ జరుగుతుంది. కానీ ఐదారు శాఖలకు మించి చర్చ జరగడం లేదు. స్థాయీ సంఘాల సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రావడం లేదు. జడ్పీ సమావేశాలకు కలెక్టర్ రాకపోవడంతో ఆర్నెల్ల క్రితం సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సమావేశానికి రావాలనే సభ్యుల కోరిక నెరవేరడం లేదు.
వృథాగా రూ.2 కోట్ల భవనం
రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ పథకం కింద, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి, పంచాయతీరాజ్ పాలకులు, సిబ్బంది, గ్రామ పరిపాలనతో అనుబంధంగా ఉన్న వివిధ శాఖల వారికి నైపుణ్యాలను పెంచేందుకు రూ.2 కోట్లతో చంపక్హిల్స్లోని గోదాముల సమీపంలో రెండెకరాల స్థలంలో జిల్లా పంచాయతీ రిసోర్సు సెంటర్(డీపీఆర్సీ) నిర్మించారు. భవనం చుట్టూ, ఆవరణలో కంపచెట్లు పెరిగాయి. భవనాన్ని నిర్మించిన గత్తేదారు జడ్పీకి అప్పగించి ఏడాది దాటింది. విశాలమైన సమావేశ మందిరం, ఆడిటోరియం, శిక్షకులకు వసతితో సుమారు 3 వేల చదరపు అడుగుల్లో ఉన్న భవనం వృథాగా ఉంది. భవనంలో 16 ఏసీలను సైతం అమర్చారు. జడ్పీ కార్యాలయానికి సొంత భవనం నిర్మించే దాకా ఈ భవనంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ అంశంపై జిల్లా పరిషత్ సభ్యులు సరైన నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. పంచాయతీరాజ్ విశ్రాంత వర్కు ఇన్స్పెక్టర్లు, గ్యాంగ్మెన్ తదితరులు 80 ఏళ్ల వయసున్న వారికి మూడేళ్లుగా నెలవారి పింఛన్ రావడం లేదు. కొత్త జిల్లా పరిషత్ల ఏర్పాటుతో వారికి దురవస్థ ఏర్పడింది. సభ్యులు ఈ అంశంపై గళం విప్పాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సమావేశానికి మంత్రి వస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.
సొంత గూడు లేక..
జిల్లా ఏర్పాటులో భాగంగా జడ్పీ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో తాత్కాలిక ప్రాతిపదికన జనగామ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. జాతీయ దినోత్సవాలు తదితర సందర్భాల్లో ప్రొటోకాల్ తదితర విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనగామ ఎంపీపీ, జడ్పీ ఛైర్పర్సన్లలో ఎవరు పతాకావిష్కరణ చేయాలనే అంశంపై తర్జనభర్జన తప్పడం లేదు. సొంత భవనం సమకూర్చాలని ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. స్థానికంగా వృథాగా ఉన్న పురపాలిక భవనాలు, ఇతర శాఖల భవనాలను పరిశీలించే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ