విజ్ఞానశాస్త్ర ప్రచారంలో పత్రికలదే ప్రధాన పాత్ర
విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహించాలని వరంగల్ ఎన్ఐటీ సంచాలకులు ఆచార్య ఎన్వీ.రమణ పిలుపునిచ్చారు. కేంద్రం శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఎన్ఐటీ సైన్స్ కమ్యూనికేషన్,
శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న సంచాలకులు ఆచార్య ఎన్వీ.రమణ,
వేదికపై ఆచార్య రామచంద్రయ్య, రిజిస్ట్రార్
గోవర్ధన్రావు, సైన్స్ కాలమిస్టు వేణుగోపాల్
కాజీపేట, న్యూస్టుడే: విజ్ఞాన శాస్త్ర ప్రచారంలో పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర వహించాలని వరంగల్ ఎన్ఐటీ సంచాలకులు ఆచార్య ఎన్వీ.రమణ పిలుపునిచ్చారు. కేంద్రం శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో ఎన్ఐటీ సైన్స్ కమ్యూనికేషన్, పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్(స్కోప్) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘విజ్ఞానశాస్త్ర ప్రచారం, ప్రింట్, ఎలక్ట్రానిక్ సమాచారం మాధ్యమాల పాత్ర’ అనే అంశంపై ఎన్ఐటీలో పాత్రికేయులకు ఒకరోజు అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. స్కోప్ సమన్వయకర్త ఆచార్య రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంచాలకులు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పరిశోధనలతో శాస్త్రీయంగా రుజువు చేసిన విజ్ఞానాన్ని ప్రజలకు చేర్చడానికి పాత్రికేయులు ప్రముఖ పాత్ర వహించాలని కోరారు. రిజిస్ట్రారు ఎస్.గోవర్ధన్రావు మాట్లాడుతూ.. రాజకీయం, సినిమాల ప్రచారం ఎక్కువగా సాగుతోందని సైన్స్ మ్యాగజైన్లు, ప్రచార మాధ్యమాలు ఎక్కువగా రావాలని సూచించారు. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత ప్రజలు అది కేవలం అణుబాంబుగానే చూశారని, దాని ద్వారా ఉద్భవించే విద్యుత్తు, ఇంకా అనేక రకాల ప్రయోజనాలున్నాయని ప్రజలు గ్రహించలేక పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త అణు ప్రాజెక్టుల ప్రయోజనాలపై అవగాహన లేక వాటిని రాజకీయం చేసి గుడ్డిగా విమర్శించడం తగదని సూచించారు. సైన్స్ కాలమిస్టు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తెలుగుపత్రికలు, తెలుగు సాహిత్యం, రేడియో, టెలివిజన్ తదితర మాధ్యమాల్లో సైన్స్ రచనలు, సీనియర్ జర్నలిస్టు గోపాలకృష్ణ తెలుగు వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా సైన్స్ ప్రచార అవకాశాల అంశాలపై ప్రసంగించారు. రామచంద్రయ్య మాట్లాడుతూ.. స్కోప్ ద్వారా విజ్ఞాన్ ప్రసార్ అనే పుస్తకాన్ని ఆన్లైన్లో చదువుకోవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్