Tholi Ekadashi: చైతన్యానికి తొలి ఏకాదశి! త్యాగ నిరతికి బక్రీద్!!
ఉమ్మడి జిల్లాలో బక్రీద్ ఆచరించడానికి ముస్లిం సోదరులు, తొలి ఏకాదశిని జరుపుకోవడానికి హిందువులు సన్నద్ధమవుతున్నారు. ఈ రెండు పండగలూ ధైర్యాన్ని నూరిపోసేవి. ఇవి ఆదివారం ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ తొణికిసలాడుతోంది. ఒకటేమో త్యాగ నిరతికి ప్రతీక. మరొకటి చైతన్యానికి నిలుపుటద్దం. విశ్వాసం, దాన గుణం అలవర్చేది బక్రీద్. వేసవిలో మోడు బారిన ప్రకృతి ఇప్పుడు చిగురిస్తున్నట్లే ఈ వర్షాకాలం ఆరంభంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేసేది తొలి ఏకాదశి.
ఉమ్మడి జిల్లాకు ఆధ్యాత్మిక శోభ
డోర్నకల్, న్యూస్టుడే
ఉమ్మడి జిల్లాలో బక్రీద్ ఆచరించడానికి ముస్లిం సోదరులు, తొలి ఏకాదశిని జరుపుకోవడానికి హిందువులు సన్నద్ధమవుతున్నారు. ఈ రెండు పండగలూ ధైర్యాన్ని నూరిపోసేవి. ఇవి ఆదివారం ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ తొణికిసలాడుతోంది. ఒకటేమో త్యాగ నిరతికి ప్రతీక. మరొకటి చైతన్యానికి నిలుపుటద్దం. విశ్వాసం, దాన గుణం అలవర్చేది బక్రీద్. వేసవిలో మోడు బారిన ప్రకృతి ఇప్పుడు చిగురిస్తున్నట్లే ఈ వర్షాకాలం ఆరంభంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేసేది తొలి ఏకాదశి.
ఆనందం.. ఆరోగ్యం!
మహ్మద్ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ జరుపుకొంటారు. ఇస్లాం పరిభాషలో దీనిని ఈద్-ఉల్-జుహా అంటారు. రంజాన్ తర్వాత ముస్లింలు అమితంగా ఇష్టపడే ప్రధానమైన పండగ ఇది. పండగ రోజు వేకువజామున స్నానాలు ఆచరించి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈద్గాకు వెళ్లి ప్రత్యేక నమాజ్ చదువుతారు. గత రెండు రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ఈద్గాకు బదులు మసీదుల్లో ఈద్ ప్రార్థన ఆచరించడానికి ముస్లిం సోదరులు సన్నద్ధమవుతున్నారు. నమాజ్ చదివాక ఇళ్లకు వెళ్లి మతాచారం, సంప్రదాయం ప్రకారం ‘ఖుర్బాని’ ఇస్తారు. దీనిని బంధుమిత్రులతో పాటు పేదలకు పంపిణీ చేస్తారు.
* సందర్భం ఏదైనా కావచ్ఛు..ఇస్లాం పేదలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పండగప్పుడు ‘ఖుర్బానీ’ ప్రధాన భూమిక పోషిస్తుంది. బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ ఇచ్చే జంతువుల మాంసంలోనూ పేదలకు కచ్చితమైన ‘వాటా’ని ఇస్లాం నిర్ధేశించింది. బలి ఇచ్చాక జంతు మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం కుటుంబసభ్యులు, రెండో భాగం బంధు మిత్రులు, మూడో భాగం పేదల కోసమని ఖాయం చేస్తారు. వాటాల పంపిణీలో ఏ కొద్ది తేడా వచ్చినా ఖుర్బానీ లక్ష్యం నెరవేరదని పవిత్ర గ్రంథం ఖురాన్ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు