తారస్థాయికి చేరిన భూ వివాదం
వెంకటాపురం మండలంలోని బెస్తగూడెంలో భూ వివాదం భగ్గుమంది. గ్రామస్థులు, ఛత్తీస్గఢ్ వలస ఆదివాసీల మధ్య శుక్రవారం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కర్రలు, పదునైన గొడ్డళ్లతో కొట్టుకోవడంతో ముగ్గురు గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గ్రామంలోని వరసిద్ధివినాయక ఆలయానికి అధికారుల
కర్రలతో కొట్టుకున్న ఇరు వర్గాలు
వెంకటాపురం, న్యూస్టుడే: వెంకటాపురం మండలంలోని బెస్తగూడెంలో భూ వివాదం భగ్గుమంది. గ్రామస్థులు, ఛత్తీస్గఢ్ వలస ఆదివాసీల మధ్య శుక్రవారం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు కర్రలు, పదునైన గొడ్డళ్లతో కొట్టుకోవడంతో ముగ్గురు గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గ్రామంలోని వరసిద్ధివినాయక ఆలయానికి అధికారుల సహకారంతో కొంత భూమిని గ్రామస్థులు ఆధీనంలోకి తీసుకున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో చుట్టూ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేశారు. ఆ భూమిలోకి ప్రవేశించిన ఛత్తీస్గఢ్ వలస ఆదివాసీలు నాగళ్లు కట్టి దుక్కి దున్నుతుండగా బెస్తగూడెం గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాట పెరిగి బాహాబాహీకి దారి తీసింది. కోపోద్రిక్తులైన పలువురు కర్రలతో కొట్టుకోవడంతో బెస్తగూడేనికి చెందిన మాటూరి దేవేందర్ తలకు తీవ్రగాయమైంది. తీవ్ర రస్తస్రావం కావడంతో అతడిని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వరంగల్కు మెరుగైన వైద్య సేవలకు తరలించారు. ఛత్తీస్గఢ్ వలస ఆదివాసీ మహిళ తలకు సైతం గాయం కావడంతో వైద్యసేవలు పొందారు. ఇరు వర్గాలు వెంకటాపురం పోలీస్స్టేషన్కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణకు దారి తీసిన పరిస్థితులను ఎస్సై జి.తిరుపతి ఆరా తీయడంతో పాటు పలువురిని మందలించారు. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు నాగరాజును కలిసిన బెస్తగూడెం వాసులు, ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. గతంలోనూ ఈ భూమిలోకి ప్రవేశించడంతో సామరస్యంగా చెప్పినా పట్టించుకోలేదని, ఈ క్రమంలో మరో ప్రాంతానికి చెందిన వలస ఆదివాసీలను తీసుకొచ్చి దున్నుతుండగా తాము అడ్డగించినట్లు విన్నవించారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దారు బెస్తగూడెం రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబరు 44లో సుమారు మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూశాఖ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. గతంలోనూ ఛత్తీస్గఢ్ వలస ఆదివాసీలు చుట్టూ వేసిన ఫెన్సింగ్ను ధ్వంసం చేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. మళ్లీ అదే ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!