కాలిపోతున్న నియంత్రికలు.. కర్షకుల కష్టాలు..!
అన్నదాతకు ఆది నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు.. విత్తనాలు, ఎరువుల పెరిగిన ధరలు మరో వైపు ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నా..
జనగామలో నియంత్రికలను మరమ్మతు చేస్తున్న సిబ్బంది
జనగామ టౌన్, న్యూస్టుడే: అన్నదాతకు ఆది నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు.. విత్తనాలు, ఎరువుల పెరిగిన ధరలు మరో వైపు ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నా.. నియంత్రిక కాలిపోతే దానిని బాగు చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటకు నీరందే సమయంలో కాలిపోతే.. కొత్తది అమర్చడానికి సమయం పడుతుందని ఆ శాఖ అధికారులు చెబుతుండడంతో చేసేది లేక.. స్వయంగా వారే తీసుకెళ్లి బాగు చేయించుకుంటున్నారు. ఈ అంశాలపై జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులపై ‘న్యూస్టుడే’ కథనం.
రోజుల తరబడి ఎదురుచూపులు..
సాధారణంగా వర్షాకాలంలో పిడుగుల, భారీ వర్షాలతో, వేసవిలో అయితే అధిక ఉష్ణోగ్రత ఓవర్ లోడ్ సమస్యతో నియంత్రికలు కాలిపోతుంటాయి. వ్యవసాయ బావుల వద్ద కాలిపోతే విద్యుత్తు శాఖ వారే వాహనంలో తీసుకెళ్లి, బాగు చేసి తిరిగి వారే తీసుకొచ్చి బిగించాలి. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇలా జరగడం లేదు. రైతులే సొంత ఖర్చులతో వాహనం సమకూర్చుకొని సమీపంలోని మరమ్మతు కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడా రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఏ ప్రాంతంలోనైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే, తిరిగి బిగించే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, కరెంటు సరఫరా చేయాల్సి ఉన్నా, చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పలుమార్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తలా కొంత డబ్బులు వేసుకుని మరమ్మతు కేంద్రానికి దూరాన్ని బట్టి రూ.2వేలు, 3వేల వరకు వాహన కిరాయి భరిస్తున్నారు.
రవాణా ఖర్చుల భారం..
జనగామ, సింగరాజుపల్లి, బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి మండలాల్లో విద్యుత్తు శాఖాపరంగా పది నియంత్రికల మరమ్మతు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆ కేంద్రాల వద్ద విద్యుత్తు శాఖాపరంగా కేవలం 25 కేవీ నియంత్రిక ఒకటి తీసుకెళ్లేందుకు చిన్న వాహనం అందుబాటులో ఉంది. అయితే పెద్ద వాటిని తీసుకెళ్లేందుకు మాత్రం వాహనం అందుబాటులో లేదు. ఎక్కువగా వ్యవసాయ బావుల వద్ద ఉన్న 60, 100, 160 కేవీ సామర్థ్యం కలిగినవి కాలిపోతే రైతులే ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు. జనగామ విద్యుత్తు డివిజన్ కేంద్రానికి 3 టన్నుల సామర్థ్యం బరువు తీసుకెళ్లే వాహనాన్ని కొనుగోలు చేసుకోవాలని ఆ శాఖ ఉంచి ఆదేశాలు వచ్చాయి. ఆ వాహనం అందుబాటులోకి వస్తే జనగామ డివిజన్కు సంబంధించి రైతులకు రవాణా భారం తప్పే అవకాశాలున్నాయి. జిల్లాలో ఉన్న అన్ని మరమ్మతు కేంద్రాల వద్ద పెద్ద వాహనాలను అందుబాటులో ఉంచి, తమపై భారం పడకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
పాలకుర్తిలో కిరాయి వాహనంలో తీసుకెళ్తూ..
జిల్లాలో వ్యవసాయ సంబంధిత నియంత్రికలు : 13,447
మరమ్మతు కేంద్రాలు : 10
మరమ్మతుకు వారం రోజులైంది
- బోడ మల్లన్న, కిష్టాపురం తండా, పాలకుర్తి మండలం
నియంత్రిక కాలిపోతే పాలకుర్తి మరమ్మతు కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులైంది. ఎట్టకేలకు శనివారం మరమ్మతు పూర్తి అయింది. మా సొంత వాహనంలోనే తీసుకెళ్తున్నాం. రవాణా ఖర్చులు మాకు భారంగా మారాయి. రవాణా కోసం విద్యుత్తు శాఖనే వాహనాన్ని సమకూరిస్తే బాగుంటుంది.
త్వరలో అందుబాటులోకి పెద్ద వాహనం
- మల్లికార్జున్, ఎస్ఈ, జనగామ సర్కిల్
వ్యవసాయ నియంత్రికలు కాలిపోతే కొన్ని సమస్యలైతే ఉన్నాయి. మరమ్మతు కేంద్రాల వద్ద కేవలం 25కేవీ ట్రాన్స్ఫార్మర్లను తీసుకెళ్లేందుకు చిన్న వాహనం అందుబాటులో ఉంది. జనగామ డివిజన్కు రవాణా సేవల కోసం ఇటీవలనే 3 టన్నుల బరువు మోసేందుకు పెద్ద వాహనం కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఇతర మరమ్మతు కేంద్రాల వద్ద కూడా రైతులపై రవాణా భారం పడకుండా చర్యలు చేపడతాం. వ్యవసాయ బావుల వద్ద రైతులు తమ మోటార్లకు కెపాసిటర్లను అమర్చుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కబ్జా కోరల్లో చెరువులు..
[ 23-04-2024]
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులపై కబ్జాదారులు కన్నేశారు. భూముల విలువ పెరగడంతో శిఖం భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
[ 23-04-2024]
పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వెస్ట్జోన్ డీసీపీ పి.సీతారాం జనగామ ఏసీపీ అంకిత్కుమార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు -
మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టాలని ధర్నా
[ 23-04-2024]
జనగామ వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించాలని, మూసివేసిన మార్కెట్ను తెరవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ గేటు ముందు ధర్నా నిర్వహించారు -
గొర్రెల పంపిణీకి మంగళం!
[ 23-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్థక శాఖ అధికారులు నిర్ణయించారు -
‘భూమి పోతే ఆత్మహత్యలే దిక్కు’
[ 23-04-2024]
న్యూ గ్రీన్ ఫీˆల్డ్ హైవే వల్ల మా వ్యవసాయ భూములు పోతే ఆత్మహత్యలే దిక్కు అని ఇస్సిపేట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ శివారులో చేపట్టిన రోడ్డు సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు -
భాజపాను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం
[ 23-04-2024]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భాజపా నిర్వహించిన రోడ్షో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. -
గాలివాన బీభత్సం.. అపార నష్టం
[ 23-04-2024]
ఆదివారం సాయంత్రం జిల్లాలో గాలివాన అపార నష్టం మిగిల్చింది. వరి, మామిడి పంటల రైతులకు గుండె కోత మిగిలింది. విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
నవ వధువు ఆత్మహత్య
[ 23-04-2024]
వివాహం జరిగిన 19 రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. -
విన్నవించాం.. పరిష్కరించండి
[ 23-04-2024]
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు -
ఇక్కడా కబ్జాల పర్వం.. వెంటాడుతున్న బెంగుళూరు భయం!
[ 23-04-2024]
బెంగళూరు నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి.. కారణం చెరువులు, కుంటలు కబ్జాలకు గురై నీటినిల్వకు చోటు లేకపోవడమే. -
నామపత్రాల జాతర..
[ 23-04-2024]
వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సోమవారం జాతరను తలపించింది. భారాస, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 10 మంది 11 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. -
మోదీ పాలనతోనే దేశాభివృద్ధి
[ 23-04-2024]
భాజపా పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
స్వల్ప ఆధిక్యంతో గెలుపు‘మన ఎంపీలు’
[ 23-04-2024]
వరంగల్ లోక్సభ స్థానం నుంచి అతి తక్కువ ఓట్ల మెజార్టీతో బకర్ అలి మీర్జా ఎంపీగా విజయం సాధించారు. ఆయన 1900, మార్చి 7న హైదరాబాద్లో జన్మించారు. ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ సర్కారులో ఫారెస్ట్లకు అసిస్టెంట్ క్యూరేటర్గా పనిచేశారు
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్