పాలకవర్గాల నియామకమెప్పుడో?
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకంలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రెండు మార్కెట్ కమిటీలు ఎప్పుడు కొలువుదీరుతాయా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం
నర్సంపేట, న్యూస్టుడే: వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకంలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో రెండు మార్కెట్ కమిటీలు ఎప్పుడు కొలువుదీరుతాయా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఎనుమాముల, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట మార్కెట్లు ఉండగా వర్ధన్నపేట, ఎనుమాముల మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. నర్సంపేట, నెక్కొండ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించలేదు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్కొండ మార్కెట్లో పాలకవర్గం రెండేళ్ల పాటు పనిచేయగా నర్సంపేటలో మాత్రం ఏడాది మాత్రమే పని చేసింది. అప్పటి నుంచి ఈ రెండు మార్కెట్లలో కమిటీలు లేవు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడంలో, మార్కెట్ యార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో కమిటీలదే కీలక భూమిక. ఈ కమిటీల నియామకంలో కొంత కాలంగా జాప్యం జరగడంతో నర్సంపేట, నెక్కొండలో ఛైర్మన్, డైరెక్టర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు.
సంధానకర్తలుగా కమిటీలు
రైతులు, వ్యాపారుల మధ్య మార్కెట్ కమిటీల పాలకవర్గాలు అనుసంధానకర్తలుగా పని చేస్తారు. ఏదైనా సమస్య వస్తే హలధారులు పాలకవర్గ కమిటీలకు గోడు చెప్పుకుంటే పరిష్కరిస్తారు.
ఆదాయంలో మిన్న
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనుమాముల మార్కెట్ తరువాత అధిక ఆదాయం వచ్చే రెండో పెద్ద మార్కెట్గా నర్సంపేట గుర్తింపు పొందింది. ఈ మార్కెట్లో పత్తి, మొక్కజొన్నల వ్యాపారం జోరుగా సాగుతోంది. పంట ఉత్పత్తులు చేతికొచ్చే తరుణంలో పాలక వర్గాన్ని నియమిస్తేనే రైతులకు మేలు కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పత్తి, మొక్కజొన్నల సీజన్లో పొరుగున ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాలోని అటవీ గ్రామాల రైతులు పండించిన ఉత్పత్తులను ఈ మార్కెట్కు తెచ్చి విక్రయిస్తారు.
బీసీ జనరల్కు రిజర్వు
నర్సంపేట, నెక్కొండ మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులు బీసీ జనరల్ కేటగిరీలకు రిజర్వు అయ్యాయి. 2014లో తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదవుల కోసం బీసీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కాని ఏళ్లతరబడి నియామకంపై నీలినీడలు కమ్ముకోవడంతో వారి ఆశలు నీరుగారాయి. ఈ చోట్ల బీసీలకు రిజర్వు కావడం వల్లే పాలకవర్గ కమిటీలను నియమించడం లేదనే గుసగుసలు అధికార పార్టీలో వినబడుతున్నాయి.
పెరిగిన పదవీకాలం
మార్కెట్ కమిటీ పాలకవర్గాల పదవీ కాలం మూడేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశించినట్లు మార్కెట్ అధికారి ప్రసాదరావు తెలిపారు. కమిటీ సభ్యుల సంఖ్య 14 ఉండగా కొత్త ఆదేశాలతో ఆ సంఖ్య 18కి పెరిగింది. వీరిలో మార్కెట్ పరిధిలోని గ్రామాలకు చెందిన 12 మంది రైతులు డైరెక్టర్లుగా ఉంటారు. వారిలో నుంచి ఒకరిని ఛైర్మన్గా నియమిస్తారు. మరో మార్కెట్లో లైసెన్సు పొందిన వ్యాపారులను డైరెక్టర్లుగా నియమిస్తారు. మరో నలుగురిని ఎక్స్ అఫీ‡షియో సభ్యులుగా నియమిస్తారు. గతంలో పాలకవర్గ పదవీ కాలం ఏడాది మాత్రమే ఉండేది. సర్కారు జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల పాటు పదవీ కాలం ఉంటుంది. ప్రభుత్వ ఆమోదంతో ఆరు నెలలు, మరో ఆరు మాసాలు ఇలా రెండు సార్లు పదవీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. దీంతో మూడేళ్లు పదవీ కాలం చేపట్టే అవకాశం ఉండడంతో ఈ సారి మార్కెట్ కమిటీ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ