అంబరాన్నంటేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్ని తాకేలా సోమవారం నుంచి ఈనెల 22 వరకు 15 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి దయాకర్రావు, చిత్రంలో జడ్పీ ఛైర్మన్ సుధీర్కుమార్, ఎంపీ దయాకర్,
చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు రాజయ్య, ధర్మారెడ్డి, యాదగిరిరెడ్డి, కుడా ఛైర్మన్ సుందర్రాజ్ తదితరులు
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్టుడే: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్ని తాకేలా సోమవారం నుంచి ఈనెల 22 వరకు 15 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై చీఫ్ విప్ వినయ్భాస్కర్, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. కవి సమ్మేళనాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల విద్యార్థులకు గాంధీ చలన చిత్రాన్ని చూపించాలన్నారు. ఇందుకోసం ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేస్తున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారించాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ రవీందర్రావు, కలెక్టర్లు గోపి, శివలింగయ్య, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, సీపీ తరుణ్జోషి, హనుమకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్తు ఛైర్మన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, సంపత్రెడ్డి, కుడా ఛైర్మన్ సుందర్రాజ్యాదవ్ పాల్గొన్నారు.
15 రోజులపాటు కార్యక్రమాలు ఇలా..
8న ఉత్సవాల సమారోహం, 9న ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ, 10న గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడం రన్, 12న రాఖీ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవాలపై ప్రసారాలు, 13న విద్యార్థులు, యువకులు, మహిళలు వివిధ సామాజిక వర్గాలతో ర్యాలీలు, 14న సాంస్కృతిక సారథి కళాకారులతో నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రత్యేక జానపద కార్యక్రమాలు, 15న స్వాతంత్య్ర వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణ, 16న ఏకకాలంలో ఎక్కడి వారు అక్కడే జాతీయ గీతాలపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్ పేరుతో క్రీడల నిర్వహణ, 19న ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ, 20న దేశభక్తి జాతీయ స్పూర్తిని నింపేలా స్వయం సహాయక సంఘాలతో ముగ్గుల పోటీలు, 21న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తు, నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల ప్రత్యేక సమావేశాల నిర్వహణ, 22న ఉత్సవాల ముగింపు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.