న్యాయవాది హత్యకు రూ. 18 లక్షల సుపారి
న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 1న రాత్రి ములుగు మండలం పందికుంట క్రాస్ సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్య జరిగిన విషయం తెలిసిందే.
10 మంది అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్, చిత్రంలో ఓఎస్డీ, ఏఎస్పీ, డీఎస్పీ తదితరులు
ములుగు, న్యూస్టుడే: న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 1న రాత్రి ములుగు మండలం పందికుంట క్రాస్ సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 5న రాత్రి నలుగురిని అరెస్టు చూపిన పోలీసులు.. ఆదివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ ములుగులోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, హనుమకొండకు చెందిన పిండి రవియాదవ్, ములుగు మండలం కొడిశల కుంటకు చెందిన వంచ రామ్మోహన్రెడ్డి హత్యకు సూత్రధారులు. పథకాన్ని అమలు చేయడానికి వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన తడక రమేష్ సహకరించాడు. ఈ నలుగురిని ఈనెల 5న అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చి రిమాండ్కు తరలించారు. మిగిలిన వారిలో హనుమకొండ జిల్లా గంగిరేణి గూడేనికి చెందిన పెరుమాండ్ల రాజు(ఏ6), పెరుమాండ్ల రాకేష్(ఏ14), వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన వైనాల శివ(ఏ11), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కొక్కెరంచకు చెందిన ఈడిగ వేణు(ఏ12), ఈడిగ జయరాం(ఏ8), నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన బుక్కా వెంకటరమణ(ఏ9)లకు హత్యతో సంబంధాలున్నాయని నిర్ధారించి అరెస్టు చేశారు.
రెక్కీ నిర్వహించి అంతమొందించారు..
హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మల్లారెడ్డి కదలికలపై నిఘా పెట్టగా మిగిలిన నలుగురు పందికుంట స్టేజి వద్ద వేచి ఉన్నారు. న్యాయవాది ప్రయాణించిన కారు స్పీడు బ్రేకర్ వల్ల వేగం తగ్గించడంతో నిందితులు వెనక నుంచి మరో కారుతో ఢీకొట్టారు. ఆయన కారు దిగి పరిశీలిస్తుండగా అక్కడే మాటు వేసి ఉన్న నలుగురులు కత్తులతో పొడిచి చంపారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాకే పరారయ్యారు.
* గంగిరేణి గూడెం వాసి పెరుమాండ్ల రాజు ఈ నేరానికి ప్రధాన కార్యనిర్వాహకుడు. రాజుకు బంధువు అయిన తడక రమేష్ 2020లో హత్య గురించి అతడితో చర్చించాడు. హత్య చేయడానికి ఇరువర్గాల మధ్య రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. రాజు కర్నూలు జిల్లాకు చెందిన జయరాం, వేణు, నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన వెంకటరమణ, నారక్కపేటకు చెందిన శివను ఒప్పించి రవీందర్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నారు.
ఆరుగురికి రిమాండ్
వరంగల్ న్యాయవిభాగం: మల్లారెడ్డి హత్య కేసులో మరో ఆరుగురు నిందితులకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ హనుమకొండ జిల్లా ప్రధాన మునిసిఫ్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు నిందితులను ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. మొత్తం 15 మందిపై హత్యానేరం, కుట్ర నేరాల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు గోనెల రవీందర్తోపాటు పిండి రవియాదవ్, వంచ రామ్మోహన్రెడ్డి, తడక రమేశ్ను అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా వారిని రిమాండ్కు తరలించారు. రవీందర్(ప్రధాన నిందితుడి కుమారుడు), బాల్నె వెంకన్న, జిట్టబోయిన సాంబమూర్తి, భరత్ అలియాస్ బన్ను, కక్కెర్ల సమ్మయ్య పరారీలో ఉన్నారని పోలీసులు తమ రెండో రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు.
మరో ఐదుగురు పరారీలో..
హత్యకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. కేసును నిష్పక్షపాతంగా సరైన పద్ధతిలో పరిశోధన చేసేందుకు ములుగు ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెకాన్ను కేసు పరిశోధన అధికారిగా నియమించామన్నారు. భూములకు సంబంధించి ఏమైనా వివాదాలుంటే కోర్టులు, రెవెన్యూ శాఖ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఓఎస్డీ గౌష్ ఆలం, ఏఎస్పీ సుధీర్ ఆర్.కెకాన్, డీఎస్పీ దేవేందర్రెడ్డి, సీఐ శ్రీదర్, ఎస్సై ఓంకార్యాదవ్, ఆర్ఐ స్వామిలను ఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)