పెరుగుతున్న గోదారి.. ఆందోళనలో ప్రజలు
గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గతనెలలో సంభవించిన వరదలతో అతలాకుతలమైన ప్రజలు.. మళ్లీ వరద పెరుగుతుండడంతో భయాందోళనలకు గురవుతున్నారు.
కంకలవాగు ఉద్ధృతికి వెంకటాపురం, మల్లాపురం మధ్య నిలిచిన రాకపోకలు
వాజేడు, మంగపేట, న్యూస్టుడే: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గతనెలలో సంభవించిన వరదలతో అతలాకుతలమైన ప్రజలు.. మళ్లీ వరద పెరుగుతుండడంతో భయాందోళనలకు గురవుతున్నారు. జాతీయరహదారిలోని పూసూరు-ముల్లెకట్ట హైలెవెల్ వంతెన వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువప్రాంతంలోని ప్రాజెక్టులు, ప్రాణహిత, ఇంద్రావతి గోదావరి ఉపనదుల నుంచి వస్తున్న వరదనీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని టేకులగూడెం సమీపంలో జాతీయరహదారి ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు-గుమ్మడిదొడ్డి గ్రామాలమధ్య రహదారిపై కొంగాలవాగు వరద చేరింది. రెండురోజులుగా స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం సోమవారం రాత్రి నుంచి వేగంగా పెరుగుతోంది. పేరూరులో మంగళవారం సాయంత్రం 6 గంటలకు 47.39 అడుగులకు (14.45 మీటర్లు) చేరుకుంది.
ఉప్పొంగిన వాగులు
వెంకటాపురం: మండలంలోని వాగులకు గోదావరి వరద పోటెత్తింది. పెంకవాగు, కంకలవాగు, జిన్నెలవాగు, బల్లకట్టువాగు, కుక్కతోగువాగులు మంగళవారం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద నీటి ప్రవాహం అధికం కావడంతో వాగులు ప్రమాదకరంగా మారాయి. వెంకటాపురం-మల్లాపురం మార్గ మధ్యలో కంకలవాగు ఉద్ధృతికి రాకపోకలు ఆగాయి. పెంకవాగు లోలెవల్ చప్టా వరద నీటి ముంపునకు గురైంది. ఆవలి ప్రాంతంలోని గిరిజనులు ప్రవాహంలోనే రాకపోకలు సాగించారు. ద్విచక్రవాహనాలను సైతం మోసుకొని వాగు దాటించుకున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో మళ్లీ కష్టాలు తప్పేలా లేవని గిరిజనం ఆందోళన చెందుతున్నారు.
కమలాపురం ఇన్టేక్వెల్ వద్ద నది ప్రవాహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా