‘స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను వక్రీకరిస్తున్న భాజపా’
స్వాతంత్య్ర పోరాటంలో భాజపా ఎక్కడుందని వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ప్రశ్నించారు.
ఫాతిమానగర్లో చేపట్టిన ఆజాదీకా గౌరవ్ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న దొంతి మాధవరెడ్డి,
చిత్రంలో పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, నేతలు నమిండ్ల శ్రీనినవాస్, ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు
కాజీపేట, న్యూస్టుడే: స్వాతంత్య్ర పోరాటంలో భాజపా ఎక్కడుందని వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ నవ సంకల్ప చింతన్ శిబిరంలో తీసుకున్న నిర్ణయం మేరకు హనుమకొండ జిల్లాలో నాయిని నేతృత్వంలో 75 కిలోమీటర్ల ఆజాదీకీ గౌరవ్ యాత్రను మంగళవారం కాజీపేట పట్టణం ఫాతిమానగర్లో ప్రారంభించారు. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకులు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్ తొలుత మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ యాత్ర వరంగల్లోని రాజీవ్గాంధీ విగ్రహం వరకు సాగింది. యాత్రలో 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ నెల 15 వరకు స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ, కాంగ్రెస్ పార్టీ త్యాగాలను నినాదాలుగా చెబుతూ యాత్ర సాగనుంది. కాగా తొలి రోజు దారి పొడవునా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఫాతిమానగర్లో నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను భాజపా వక్రీకరిస్తోందని, సర్దార్ వల్లభభాయిపటేల్ పేరును వాడుకుంటూ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1885-1947 మధ్య కాంగ్రెస్ స్వాతంత్య్ర సంగ్రామం సాగించిందని, బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, పింగళి వెంకయ్య, పీవీ నరసింహరావు లాంటి ఎంతో మంది సమరయోధుల ఉద్యమ ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాలు, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, గరీభీ హఠావో పథకాలతో దేశాన్ని కాంగ్రెస్ ముందుకు నడిపించిందన్నారు. భాజపా అకృత్యాలను చూస్తూ ఊర్కోబోమన్నారు. ఈ యాత్రలో పరకాల ఇన్ఛార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్, కార్పొరేటర్లు తోల వెంకన్న, పోతుల శ్రీమాన్, సీనియర్ నాయకులు మహ్మద్ అంకూష్, గొట్టిముక్కుల రమణారెడ్డి, రామకృష్ణ, బంక సరళ, స్వప్న, సమత, భారతమ్మ విక్రమ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణం చవక..పార్కింగ్ భారం
[ 28-03-2024]
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. -
ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి
[ 28-03-2024]
ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు.. రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. -
అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు
[ 28-03-2024]
బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. -
వెలుగల ప్రస్థానంలో చీకట్లు!
[ 28-03-2024]
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. అలాంటిది ఉమ్మడి వరంగల్లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. -
విదేశీ పక్షులు.. విశిష్ఠ అతిథులు
[ 28-03-2024]
ఆహ్లాదకర వాతావరణాన్ని మనుషులే కాదు.. పక్షులూ ఆస్వాదిస్తాయనడానికి ఇది నిదర్శనం. వేసవిలో అనుకూల వాతావరణం కోసం వేల మైళ్లు ప్రయాణించి.. మన జిల్లాకు వచ్చాయి పలురకాల పక్షులు. -
అమాయకులకు సైబర్ ఉచ్చు..
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు వారి బారిన పడుతున్నారు. -
స్తంభాన్ని సరిచేశారు..
[ 28-03-2024]
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులోని వరి చేనులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని అధికారులు సరిచేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు
[ 28-03-2024]
తప్పుడు సర్వే నంబర్లతో దేవాలయాల భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వాటిని పరిశీలించి రద్దు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల సబ్ రిజిస్టర్లకు వరంగల్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత లేఖ రాశారు. -
సారు.. ఏ ఊరినీ వదల్లేదు..!
[ 28-03-2024]
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. వాటిని బాగు చేయాల్సిన ఓ అధికారి అవినీతి సర్పంచులు, అధికారుల అడుగులకు మడుగులొత్తుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఊళ్లలో జరిగిన అనేక కుంభకోణాలు, ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదులొచ్చినా చూసీచూడనట్టు ఉన్నారు. -
ధాన్యలక్ష్మికి చేయూత
[ 28-03-2024]
అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు చూపిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళలు నిరూపిస్తున్నారు. మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్ల పథకం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంది. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
[ 28-03-2024]
మండలంలోని కొడవటంచలో సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి నాకబలి (పుష్పయాగం) కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. -
మొక్కల సంరక్షణ తప్పనిసరి
[ 28-03-2024]
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని అటవీ శాఖ సర్కిల్ సీసీఎఫ్ ప్రభాకర్ బుధవారం జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఏటూరునాగారం కార్యాలయంలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేశారు. -
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
[ 28-03-2024]
క్షయ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-03-2024]
న్నికల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టుల్లో సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే