వజ్రోత్సవాలకు సమన్వయంతో పనిచేయాలి
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 15న ఖిలావరంగల్ ఖుష్మహల్ వద్ద జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పాలనాధికారి గోపి ఆదేశించారు.
స్థల పరిశీలన చేస్తున్న కలెక్టర్ గోపి, ఆర్డీవో మహేందర్జీ, ఏసీపీ నరేష్కుమార్
వరంగల్ కలెక్టరేట్, న్యూస్టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 15న ఖిలావరంగల్ ఖుష్మహల్ వద్ద జరిగే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పాలనాధికారి గోపి ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్ సెమినార్ హాల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు. అదనపు కలెక్టర్లు శ్రీవత్స, హరిసింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఖిలావరంగల్, న్యూస్టుడే: ఖిలావరంగల్ కోటలో ఈ నెల 15న స్వాతంత్ర వేడుకలు నిర్వహించేందుకు కలెక్టర్ గోపి బుధవారం పరిశీలించారు. మధ్యకోట ఖుష్మహల్ పక్కన ఖాళీ స్థలం అనుకూలంగా ఉందా, వేరే ప్రాంతంలో చేయాలా అనే విషయాలపై ఆర్డీవో మహేందర్జీ, తహసీల్దార్ ఫణికుమార్, మామునూరు ఏసీపీ నరేష్కుమార్, డీపీఆర్వో పల్లవి, కోట కోర్డినేటర్ శ్రీకాంత్, మిల్స్కాలనీ సీఐ శ్రీనివాస్తో చర్చించారు.
విస్తృత ఏర్పాట్లు
కార్పొరేషన్, న్యూస్టుడే: భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలి, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యకూడళ్లను మూడు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య కోరారు. బుధవారం సాయంత్రం అన్ని విభాగాల వింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 22 వరకు వజ్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ 13వ తేదీలోగా పూర్తవ్వాలని, అదే రోజూ మైదానాల్లో బెలూన్లు ఎగుర వేయాలని, 16న 66 డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన, 19న పలివేల్పుల, క్రిస్టియన్ కాలనీలో నిరాశ్రయుల కేంద్రాల్లో పండ్ల పంపిణీ, 20న ఎస్హెచ్జీ మహిళలకు ముగ్గుల పోటీలు, 21న ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మేయర్, కమిషనర్లు సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్ రషీద్, ఉపకమిషనర్లు జోనా, శ్రీనివాస్రెడ్డి, సెక్రటరీ విజయలక్ష్మి, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, సీహెచ్వో శ్రీనివాస్, ఈఈ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు పరుగు
వరంగల్ క్రీడావిభాగం, న్యూస్టుడే: వజ్రోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఫ్రీడమ్ పరుగు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి సొటాల ఇందిర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 6.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ఓసిటీలోని క్రీడామైదానం వరకు ఈ పరుగు కొనసాగుతుంది. యువతకు ఈ నెల 13, 14వ తేదీల్లో అండర్-17, 20 విభాగాల్లో మండల స్థాయి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ పోటీలు ఈ నెల 18న ఓసిటీ మైదానంలో జిల్లాస్థాయి జూడో, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, రెజ్లింగ్ తదితర అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు 19వ తేదీన బ్యాడ్మింటన్, క్యారమ్స్, చదరంగం, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్లో పోటీలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు