జెండా ఎగరేసి ప్రాణాలొదిలిన యుద్ధవీరుడు
లచ్చవ్వా.. బిడ్డలను జాగ్రత్తగా చూసుకో.. పసివాడిని ఏడవకుండా చూడు.. ఇంటిమీదకు రజాకార్లు రావొచ్చు.. అని రోజూ చెబుతుండే ఆయనకు ఆ రోజే చివరి ఘడియలు సమీపిస్తాయనుకోలేదు ఆమె. 15 రోజుల బాబును, ఇద్దరు బిడ్డలను,
నేడు బత్తిని మొగిలయ్యగౌడ్ వర్ధంతి
-ఈనాడు, వరంగల్, న్యూస్టుడే, ఖిలావరంగల్
లచ్చవ్వా.. బిడ్డలను జాగ్రత్తగా చూసుకో.. పసివాడిని ఏడవకుండా చూడు.. ఇంటిమీదకు రజాకార్లు రావొచ్చు.. అని రోజూ చెబుతుండే ఆయనకు ఆ రోజే చివరి ఘడియలు సమీపిస్తాయనుకోలేదు ఆమె. 15 రోజుల బాబును, ఇద్దరు బిడ్డలను, భార్యను శాశ్వతంగా వదిలి దేశం కోసం ప్రాణాలు వదిలారు ఆయన. ఆయనే బత్తిని మొగిలయ్య. స్వాతంత్య్ర పోరాటంలో ఆయనదో ప్రత్యేక స్థానం.. తన సహచరులను కాపాడుకోవడానికి 1946 ఆగస్టు 11న నేలకొరిగిన మొగిలయ్యను ఘనంగా స్మరించుకుందాం..
వరంగల్ తూర్పు కోటకు చెందిన మొగిలయ్యది సామాన్య మధ్య తరగతి గీత కార్మిక కుటుంబం. ఆర్య సమాజంపై ఉన్న మక్కువతో వాలంటీర్లకు కర్రసాములో శిక్షణ ఇచ్చేవారు. విద్యావంతుడైన అన్న రామస్వామి ప్రోత్సాహంతో అప్పటికే ఉద్యమ కార్యకర్తగా పని చేస్తున్నారు. కర్రసాము శిక్షణ అనంతరం ప్రతి ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించేవారు. రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ తరఫున వరంగల్లో ఖాసిం షరీఫ్(లకడీ పహల్వాన్) వారి సైన్యాన్ని నడిపించారు. కోట కేంద్రంగా జాతీయ జెండాను ఎగుర వేస్తున్నారని తెలిసిన రజాకార్లు 150 మంది దాడి చేసేందుకు కోటకు వచ్చారు. అప్పటికే జాతీయ జెండాను ఎగుర వేసి తేనీరు తాగేందుకు మొగిలయ్య ఇంటికి చేరుకున్నారు ఉద్యమకారులు. మొగిలయ్య మాత్రం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అన్న రామస్వామి, సహచర బృందంపై దాడి జరుగుతోందన్న విషయం తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకున్న మొగిలయ్య నిజాం సైన్యంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన కత్తి పిడి విరిగిపోయింది. దీంతో రాజకార్లు దొంగదెబ్బ తీశారు. ఇలా తన సహచరులను కాపాడిన మొగిలయ్య భరతమాత ఒడిలో ఒరిగిపోయారు.
ఖిలావరంగల్ తూర్పుకోటలోని మొగిలయ్య ఇల్లు
చరిత్రను మరవొద్దని..
నాటి మొగిలయ్య ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా స్వాతంత్ర సమరయోధులు జేపీఎన్ రోడ్డులో మొగిలయ్య పేరిట భవనం నిర్మించారు. ఆయన ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ ‘చరిత్రను మరిచిన ఓరుగల్లు ఉద్యమ కెరటం బత్తిని మొగిలయ్యగౌడ్’ పేరుతో కట్టగాని కొమురయ్యగౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొమురయ్య కుమారుడు కట్టగాని రవీందర్ పుస్తకాన్ని రచించి ఆవిష్కరించారు.
పింఛను తప్ప ఏ గుర్తింపూ అందలేదు..
స్వాతంత్య్రం వచ్చాక ఆ కుటుంబానికి పింఛను సాయం తప్ప ఏమీ అందలేదు. భర్త పింఛనుతోనే ఇద్దరు కూతుళ్లు, కొడుకును పెంచి పెద్ద చేశారు లచ్చవ్వ. ‘అమ్మ నాలుగేళ్ల కిందట చనిపోయింది.. స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన కుటుంబాలకు ఎటువంటి గుర్తింపు లేదు’ అని మొగిలయ్య కుమారుడు బత్తిని బాబుగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మొగిలయ్య స్నేహితులు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నా.. వారి నుంచి సాయం పొందలేకపోయామని కన్నీటిపర్యంతమయ్యారు. హైదరాబాద్లో ఉన్న సోదరి దగ్గర పెరిగి బాబు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ కంపెనీ(ఈసీఈ)లో పని చేసి అక్కడే ఉద్యోగ విరమణ చేశారు. పెద్ద అక్క విమలక్క మరణించగా చిన్న అక్క సుక్కుబాయి హైదరాబాద్లో నివసిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు కడియం ఝలక్!
[ 29-03-2024]
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. -
మానుకోట ఎమ్మెల్యే వాహనం తనిఖీ
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నెల్లికుదురు వద్ద నెలకొల్పిన చెక్ పోస్టు వద్ద గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. -
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం
[ 29-03-2024]
వరంగల్ పోచమ్మమైదాన్లోని జెకోటియా షాపింగ్ మాల్లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
గ్రంథాలయం మాది..పుస్తకం మీది!
[ 29-03-2024]
నేటి తరం పిల్లలు పుస్తక పఠనానికి క్రమంగా దూరమవుతున్నారు. చరవాణుల వ్యామోహంలో పడి గ్రంథాలయాల గడప తొక్కనివారు ఎంతో మంది ఉన్నారు. -
ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం
[ 29-03-2024]
భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. -
యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ
[ 29-03-2024]
వరంగల్, హనుమకొండ నగరాల నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఆలయ భూములు ఆక్రమణల చెరలో ఉన్నాయి. ఈ స్థలాల్లో పలుకుబడి ఉన్నవాళ్లు పెద్ద భవనాలు, ఇళ్లు నిర్మించుకున్నారు. -
ఇసుకాసురులపై పోలీసుల కొరడా
[ 29-03-2024]
సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. -
నాణ్యతా.. వారికి మామూలే!
[ 29-03-2024]
ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. -
వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
[ 29-03-2024]
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. -
మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలి
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ను అధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
ఆస్తి పన్ను బకాయిదారులపై కొరడా
[ 29-03-2024]
ఆస్తి పన్ను మొండి బకాయిదారులపై మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలని కోరుతున్నారు. -
అక్రమ వ్యాపారాలపై ప్రత్యేక నిఘా
[ 29-03-2024]
జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. -
వేగవంతంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
[ 29-03-2024]
మహదేవపూర్ మండలంలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. -
పల్లెల్లో బెట్టింగ్ల జోరు
[ 29-03-2024]
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లె ప్రాంతంలో విస్తరించింది. జిల్లాలో మారుమూల ప్రాంతమైన కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పల్లెల్లో యువకులు, వ్యాపారులు, విద్యార్థులు పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి