రాములోరి భూములు అన్యాక్రాంతం..!
పాలకుర్తి, న్యూస్టుడే: దక్షిణ అయోధ్యగా పిలిచే వల్మిడి సీతా రామచంద్రస్వామి ఆలయ భూములు కొన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు రహస్యంగా వాటిని కబ్జా చేస్తుండడంతో క్రమక్రమంగా విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దేవాదాయ శాఖ, పాలకమండలి సభ్యులు పర్యవేక్షిస్తున్నా.
వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం
పాలకుర్తి, న్యూస్టుడే: దక్షిణ అయోధ్యగా పిలిచే వల్మిడి సీతా రామచంద్రస్వామి ఆలయ భూములు కొన్ని ప్రాంతాల్లో అన్యాక్రాంతమవుతున్నాయి. కొందరు రహస్యంగా వాటిని కబ్జా చేస్తుండడంతో క్రమక్రమంగా విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. దేవాదాయ శాఖ, పాలకమండలి సభ్యులు పర్యవేక్షిస్తున్నా.. వారి కన్నులనుగప్పి ఆక్రమిస్తున్నారు. సీతా రామచంద్రస్వామి ఆలయ పరిధిలో వందల ఎకరాల భూములున్నాయి. అయితే వాటిని ప్రస్తుతం కౌలుకు ఇస్తున్నదెవరో, సాగు చేస్తున్నదెవరో తెలియని పరిస్థితి. సమగ్ర వివరాలతో ‘న్యూస్టుడే’ కథనం.
తరతరాల చరిత్ర..
జిల్లాలో ధూప దీప నైవేద్యాల పేరుతో వచ్చిన భూములను కొందరు వ్యాపారులు స్థానిక రైతులతో కుమ్మక్కై కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నల్గొండ జిల్లా చౌళ్లరామారం గ్రామానికి చెందిన స్థానాచార్యులు గతంలో దేవస్థానంలో పూజారిగా ఉన్న సమయంలో ఆలయాల కోసం దేశ్ముఖ్(దొరల) వద్ద నుంచి భూములు సేకరించారు. వీటిపై వచ్చిన ఆదాయాన్ని సీతా రామచంద్ర స్వామి వారి ఉత్సవాలు, పూజలు, జాతర ఇతర ఖర్చులకు వినియోగించేవారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖల లెక్కల ప్రకారం దేవస్థానం కింద పలు మండలాల్లో భూములున్నాయి.
విలువ రూ.కోట్లలోనే..
వల్మిడి సీతా రామచంద్ర స్వామివారి స్థలాలు.. రికార్డులపరంగా చూస్తే దాదాపు 57 ఎకరాల వరకు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో రూ.కోట్లలోనే ఉంటుంది. అన్యాక్రాంతమైన భూములను సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏటా బహిరంగ వేలం నిర్వహిస్తే కౌలు ఎక్కువగా వస్తుందని, ఫలితంగా ఆలయ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తాత్కాలిక పాలక మండలి సభ్యులు, దేవాదాయశాఖ అధికారులు ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలున్నాయి. పాలకుర్తి మండలంలోని ఇతర ఆలయాల స్థలాల పరిస్థితి సైతం ఇలాగే ఉందని తెలుస్తోంది. చాలా చోట్ల అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు.
రికార్డుల్లో తారుమారు..
దేవరుప్పుల మండలంలో ఆలయానికి సుమారు పదుల ఎకరాల్లో భూములు ఉన్నాయి. అయితే ఓ గ్రామంలో ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నాయి. కొందరు కొంతమేర కొన్నేళ్లుగా ఆక్రమించుకున్నారు. తాత్కాలిక నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా బడా నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు దేవాదాయశాఖ అధికారులు ఆలయ భూములని బోర్డులు పెట్టినా, నోటీసులు అందజేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ఒకరిని చూసి మరొకరు అన్నట్లు ఇప్పటికే చాలామంది తిష్ఠ వేశారు. ఈ అంశంపై కోర్టులో కేసు నడుస్తోందని సమాచారం. ఇక కొడకండ్ల మండలంలో ఆలయం పేరిట ఉండాల్సిన భూమి ఓ వ్యక్తి పేరుగా రికార్డుల్లో చూపిస్తోంది. ధరిణిలోనూ ఇదే సమాచారం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే శాఖాధికారులు కోర్టుల్లో కేసులు కూడా దాఖలు చేశారు. ఎలాంటి తీర్పు రాలేదు.
పూర్తి వివరాలు తెలుసుకుంటా..
- రజినికుమారి, సోమేశ్వరాలయ ఈవో
స్వామివారి భూములు కొంతమేర కబ్జాకు గురవుతున్నా విషయం సిబ్బంది ద్వారా తెలుసుకున్నా. బాధ్యతలు చేపట్టి కొన్ని నెలలే అవుతుంది. ఇంకా పూర్తి స్థాయి ఛార్జి తీసుకోలేదు. ప్రస్తుతమున్న స్థలాలను పాలకమండలి సభ్యుల సహకారంతో కౌలుకు ఇస్తున్నాం. కొందరు కౌలు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో గతంలో అధికారులు నోటిసులు ఇచ్చారు. ఈ విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటా.
మొత్తం భూములు: 57 ఎకరాలు
విస్తరించిన మండలాలు పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల (జనగామ జిల్లా), రాయపర్తి (వరంగల్), పెద్దవంగర (మహబూబాబాద్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని