కొడకండ్ల పోస్టుమాస్టర్ అరెస్టుకు రంగం సిద్ధం?
కొడకండ్ల తపాలా కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ సుమారు రూ.1.72 కోటి అవినీతికి పాల్పడిన పోస్టుమాస్టర్ కె.సతీష్ పోస్టల్, విచారణ అధికారులకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం.
కొడకండ్ల, న్యూస్టుడే: కొడకండ్ల తపాలా కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ సుమారు రూ.1.72 కోటి అవినీతికి పాల్పడిన పోస్టుమాస్టర్ కె.సతీష్ పోస్టల్, విచారణ అధికారులకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. రెండు నెలల కిందట ఆయన చేసిన అవినీతి వెలుగు చూడడంతో విధుల నుంచి తొలగించారు. తపాలా శాఖ ఉన్నతాధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టగా, పోస్టల్ సాఫ్ట్వేర్ లొసుగుల ఆధారంగా సెలవు దినాల ముందు రోజుల్లో రూ.లక్షల్లో ఇతరుల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. తిరిగి ఆ ఖాతాల నుంచి నగదు డ్రా చేయించుకొని సొంతానికి వినియోగించుకొన్నట్లు గుర్తించారు. స్థానిక తపాలా కార్యాలయంలోని కింది స్థాయి సిబ్బంది ఖాతాకు నగదును మళ్లించడాన్ని గుర్తించిన అధికారులు ఒకరిని విధుల నుంచి తొలగించి ఆయన బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని తపాలా శాఖలో రూ.కోటి అవినీతిపై గత నెల సీబీఐ అధికారులు వరంగల్ కేంద్రంలో తపాలా అధికారులను కలిసి అవినీతి వివరాలు సేకరించారు. వారం రోజుల కిందట పూర్తి వివరాలు రాబట్టిన సీబీఐ పోస్టుమాస్టర్పై కేసు నమోదు చేసి అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పోస్టుమాస్టర్ తమకు అందుబాటులో లేకుండా సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారీలో ఉన్నట్లు తపాలా శాఖ అధికారులు వివరించారు. పోస్టుమాస్టర్ ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నట్లు తమకు తెలిసినట్లు కొడకండ్ల కార్యాలయ పరిశీలనకు వచ్చిన తపాలా అధికారి ఒకరు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా