కాళోజీ స్ఫూర్తి .. అవయవదానంలో మేటి
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన రచనలే కాదు, తన పార్థివదేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అందజేయాలని కోరుకున్న కాళన్న భౌతికదేహం వైద్య విద్యార్థులకు పాఠమైంది. ఆ మహనీయుడి నుంచి వరంగల్కు
కరీమాబాద్లో డాక్టర్ పరికిపండ్ల అశోక్తో అవయవదాన హామీ పత్రాలను చూపుతున్న దాతలు
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ఆయన రచనలే కాదు, తన పార్థివదేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అందజేయాలని కోరుకున్న కాళన్న భౌతికదేహం వైద్య విద్యార్థులకు పాఠమైంది. ఆ మహనీయుడి నుంచి వరంగల్కు చెందిన ఆయూష్ వైద్యుడు పరికిపండ్ల అశోక్, విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు కొన్రెడ్డి మల్లారెడ్డి స్ఫూర్తి పొందారు. సమాజానికి సేవ చేయాలని సంకల్పించారు. గత ఎనిమిదేళ్లుగా నేత్రదానం, అవయవదానం, మృతదేహాల దానంపై పనిచేస్తూ ఎందరికో స్పూర్తినిస్తున్నారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -ఈనాడు, వరంగల్, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే:
ఒప్పిస్తూ.. అవగాహన కల్పిస్తూ
అవయవదానంపై చాలామందికి అవగాహన లేదు. అవయవదానంతో చిరంజీవులవుతారని వారికి అవగాహన కల్పించడంలో తెలంగాణ నేత్ర, శరీర, అవయవదాతల అసోసియేషన్ గత 8 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ వారి నుంచి ముందస్తుగా అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. నేత్ర, శరీర దానం చేసిన వారి దశదినకర్మల సమయంలో డాక్టర్ పరికిపండ్ల అశోక్, మల్లారెడ్డి అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రమాదం లేదా ఇతర కారణంతో కొందరు జీవన్మృతులు (బ్రెయిన్ డెడ్)గా మారతారు. వారి కుటుంబ సభ్యులు కొండంత దుఃఖంలోనూ అవయవదానాలకు అంగీకరిస్తారు. మల్లారెడ్డి వారి దశదినకర్మకు వెళ్లి సంతాపసభ నిర్వహిస్తారు. అవయవదానంపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. మధ్యలో కార్నియా కోల్పోయిన అంధులకు నేత్రదానంతో కళ్లు వచ్చే అవకాశం ఉంది. వీరిని కార్నియా అంధులంటారు. ఇలాంటి వారు దేశంలో సుమారు 15 లక్షల మంది ఉన్నారని అంచనా. శ్రీలంకలో చనిపోయిన ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలనే నిబంధన ఉందట. మనదేశంలోనూ ఇలాంటి చట్టం చేస్తే కేవలం పది రోజుల్లో అంధులందరికీ చూపు వస్తుందని అంటున్నారు.
అలాంటి వారు ఎంతో మంది
* ఇటీవల పోలీసు కమిషనరేట్లో ఓ కానిస్టేబుల్కు బ్రెయిన్డెడ్ అయింది. ఆయన భార్య ఆర్నెల్ల గర్భిణీ. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి జీవన్దాన్కు అవయవదానం చేశారు. గతేడాది హనుమకొండ ప్రకాశ్రెడ్డిపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురు. ప్రమాదంలో గాయపడి జీవన్మృతురాలిగా మారడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు.
* 2018లో హనుమకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్కు చెందిన రైతు నర్సింహారెడ్డి తలకు బలమైన గాయమైంది. ఆయన బ్రెయిన్డెడ్ అయిందని వైద్యులు చెప్పారు. తెలంగాణ నేత్ర, అవయవ శరీర దాతల సంఘం సభ్యులు ఆయన కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆయన కళ్లు, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను దానం చేసి ఐదుగురి ప్రాణాలను కాపాడారు.
* వరంగల్ నాయుడు పెట్రోల్బంకు వద్ద మే 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో గణపతినగర్కు చెందిన పోలీసు కానిస్టేబుల్ సెల్వం సతీష్(36) తలకు గాయమైంది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మే 9న బ్రెయిన్ డెడ్ అయింది. ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, 2 మూత్రపిండాలను దానం చేశారు.
* వరంగల్ రెడ్డిపాలెంకు చెందిన నాగపూరి నవీన్(24)అనే విద్యార్థికి రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయింది. ఆయన కుటుంబ సభ్యులు నాగపూరి మొగిలి, వరలక్ష్మి.. నవీన్ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రెండు మూత్రపిండాలు, నేత్రాలను దానం చేసి 8మందికి పునర్జన్మ నిచ్చారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా
- డాక్టర్ పరికిపండ్ల అశోక్, తెలంగాణ నేత్ర, శరీర, అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
దానాల్లోకెళ్లా అవయవ దానం అత్యుత్తమమైనది, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలి. 2015 నుంచి శరీర అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అవయవదానం చేస్తున్నారు.
విశ్రాంత జీవితం దీనికే అంకితం
- మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, నేత్ర, శరీర, అవయవదాతల సంఘం
ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందినప్పటి నుంచి శరీర, అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాను. వందల సంఖ్యలో అవయమ, నేత్రదానాలు చేయగలిగాను. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. చాలా మంది ముందుకు వస్తున్నారు. కేఎంసీˆ వైద్యవిద్యార్థుల పరిశోధనకు అవయవదానం ఉపయోగపడుతోంది.
నాన్న కోరిక మేరకు..
- ఎనమల్ల భిక్షపతి, కరీమాబాద్
మానాన్న ఎనమల్ల చేరాలు బ్యాంకు ఆఫ్ బరోడాలో మేనేజర్గా పని చేసేవారు. 2019 సెప్టెంబర్లో చనిపోయారు. తన దేహాన్ని కేఎంసీˆ వైద్య విద్యార్థుల పరిశోధనకు ఇవ్వాలని అయన అప్పట్లోనే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కేఎంసీˆకి మృతదేహాన్ని అప్పగించాం. నాన్న దేహం వైద్యవిద్యార్థుల పరిశోధనకు ఉపయోగపడటం గర్వంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?