logo

జాతీయభావం వెల్లివిరిసె.. మువ్వన్నెల జెండా మురిసె

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురపాలక సంఘం, మదర్‌థెరిస్సా చౌరస్తా, మూడుకొట్ల చౌరస్తా, పత్తిపాకల నుంచి జాతీయజెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు.

Published : 14 Aug 2022 05:58 IST

మహబూబాబాద్‌లో బుడగలు వదులుతున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌,

ఏఎస్పీ యోగేశ్‌గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో

కొమురయ్య, పురపాలక సంఘం ఛైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి,

కమిషనర్‌ కె.ప్రసన్నరాణి, తహసీల్దార్‌ నాగభవాని

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురపాలక సంఘం, మదర్‌థెరిస్సా చౌరస్తా, మూడుకొట్ల చౌరస్తా, పత్తిపాకల నుంచి జాతీయజెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. తొర్రూరు బస్టాండ్‌ కూడలిలో త్రివర్ణాలతో కూడిన గాలిబుడగలను ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, ఏఎస్పీ యోగేశ్‌గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో కొమురయ్య, పురపాలక సంఘం ఛైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, కమిషనర్‌ కె.ప్రసన్నరాణి, తహసీల్దార్‌ నాగభవాని వదిలారు. డీఈఈ ఉపేందర్‌, వార్డు కౌన్సిలర్లు, మెప్మా ప్రతినిధులు, పురపాలక సిబ్బంది, ఐసీడీఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయనేతల వేషధారణలతో అలరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని