నీటి గుంతలో పడి బాలుడి మృతి
ప్రమాదవశాత్తూ ఓ బాలుడు నీటి గుంతలో పడి చనిపోయిన విషాదమిది. వరంగల్ భద్రకాళి రోడ్డు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పరిమి హరిహరన్(6) మృతిచెందాడు. భద్రకాళి రోడ్
హరిహరన్(పాత చిత్రం)
న్యూస్టుడే, రంగంపేట, ములుగు రోడ్డు: ప్రమాదవశాత్తూ ఓ బాలుడు నీటి గుంతలో పడి చనిపోయిన విషాదమిది. వరంగల్ భద్రకాళి రోడ్డు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పరిమి హరిహరన్(6) మృతిచెందాడు. భద్రకాళి రోడ్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం సమీపంలో పరిమి ఫణిశర్మ- వైశాలి దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దంపతులు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తారు. పిల్లల ఆలనాపాలన అమ్మమ్మ, తాతయ్య చూస్తారు. తండ్రి ఇచ్చిన జాతీయ పతాకంతో ఆడుకుంటూ హరిహరన్ శనివారం ఇంటి సమీపంలోని నీటి గుంతవైపు వెళ్లాడు. అదే సమయంలో భద్రకాళి దేవాలయం నుంచి 75వ స్వాతంత్య్ర ర్యాలీ జరిగింది. మధ్యాహ్నం 12.30 వరకు కూడా మనుమడు ఇంటికి రాకపోవడంతో ఆ ర్యాలీ చూడడానికి వెళ్లి ఉంటాడని అమ్మమ్మ, తాతయ్య భావించారు. తర్వాత తప్పిపోయాడని భావించి పరిసరాల్లో వెతికారు. నీటి గుంత వద్ద పిల్లాడి కాలి అడుగులు గుర్తించి అనుమానంతో ఓ వ్యక్తి గుంతలోకి దిగి హరిహరన్ మృతదేహాన్ని వెలికి తీశాడు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!