కుమార్తెను పరీక్షకు తీసుకెళ్తూ పరలోకానికి..
తన కూతురు ఉద్యోగం సాధించి ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించిన ఆ తండ్రి ఆశల్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. పెద్ద కుమారుడి నిశ్చితార్థం 18న ఉండటంతో ఘనంగా వివాహం చేయాలనుకున్న ఆయన కలలు కల్లలయ్యాయి. కమలాపూర్
శ్యాం సుందర్
కమలాపూర్, న్యూస్టుడే: తన కూతురు ఉద్యోగం సాధించి ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించిన ఆ తండ్రి ఆశల్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. పెద్ద కుమారుడి నిశ్చితార్థం 18న ఉండటంతో ఘనంగా వివాహం చేయాలనుకున్న ఆయన కలలు కల్లలయ్యాయి. కమలాపూర్ మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. హనుమకొండ నుంచి వేములపల్లి వైపు వరంగల్ డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళుతోంది. ఈ క్రమంలో డ్రైవర్ అంబాల శివారులోని వాగు సమీప మూలమలుపు వద్దకు రాగానే తన కుమార్తె సింధూజతో కలిసి హనుమకొండ వైపు వెళ్తున్న కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన గన్ను శ్యాంసుందర్ (50) ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తలకు, కాళ్లు, చేతులకు బలమైన గాయాలై శ్యాంసుందర్ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక కూర్చున్న సింధూజ తలకు, కాళ్లు, చేతులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సింధూజ డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. శనివారం హనుమకొండలో పరీక్ష ఉండటంతో తండ్రి తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ గుడికందుల శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
వారంలోనే రెండో ప్రమాదం..
వారం రోజుల వ్యవధిలో ఒక్కటే మార్గంలో ఇద్దరు బస్సు కారణంగానే మృతి చెందారు. గత ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకని శనిగరం గ్రామానికి చెందిన హరికృష్ణ వెళ్తుండగా బస్సు ఢీకొట్టి మృతి చెందారు. శనివారం నాటి దుర్ఘటనలో కుమార్తెని పరీక్షకు తీసుకెళ్తూ బస్సు ఢీకొట్టడంతో తండ్రి దుర్మరణం పాలయ్యాడు. ఆర్టీసీ బస్సుల డ్రైవర్ల అతివేగం, అజాగ్రత్తనే రెండు నిండు ప్రాణాలను బలిగొందని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల అతివేగాన్ని నియంత్రించి డ్రైవర్ల వేగానికి కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్