గీత దాటితే ఉద్యోగం ఉండదు!
ఎవరి పనులు వారే చేయాలి.., ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటే ఉద్యోగాలు ఊడుతాయి. ఆర్ఐల డిజిటల్ కీస్, పాస్వర్డ్లు, లాగిన్లు వాడితే సదరు బిల్కలెక్టర్లు, కారోబార్లు, ఒప్పంద ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తప్పవని మేయర్ గుండు
పన్నుల విభాగం ఆర్ఐలతో సమావేశమైన మేయర్ సుధారాణి
కార్పొరేషన్, న్యూస్టుడే: ఎవరి పనులు వారే చేయాలి.., ఇతరుల విధుల్లో జోక్యం చేసుకుంటే ఉద్యోగాలు ఊడుతాయి. ఆర్ఐల డిజిటల్ కీస్, పాస్వర్డ్లు, లాగిన్లు వాడితే సదరు బిల్కలెక్టర్లు, కారోబార్లు, ఒప్పంద ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తప్పవని మేయర్ గుండు సుధారాణి హెచ్చరించారు. బుధవారం ‘ఈనాడు’లో వచ్చిన వారిదే కీలక పాత్ర కథనానికి ఆమె స్పందించారు. సాయంత్రం పన్నుల విభాగం ఆర్వోలు, ఆర్ఐలు, బిల్కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇ-ఆఫీీస్ ఓపెన్ చేయడం, దస్త్రాలు చూడటం తెలియదన్న ఆర్ఐలపై మండిపడ్డారు. ముగ్గురు, నలుగురు ఆర్ఐల ఫైళ్లు కిందిస్థాయి బిల్కలెక్టర్లు క్లియర్ చేస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అంతర్జాలంపై అవగాహన లేని వారికి 15 రోజుల్లో నేర్చుకునేలా శిక్షణ ఇవ్వాలని అదనపు కమిషనర్ రషీీద్, కంప్యూటర్ విభాగం ఇన్ఛార్జి రమేష్కు సూచించారు. ఆర్ఐల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు బిల్కలెక్టర్లు, కారోబార్లను పిలిపించి క్లాస్ తీసుకున్నారు. గీత దాటితే ఆర్ఐలను తొలగిస్తామన్నారు. ఆర్ఐలు, బిల్కలెక్టర్లపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉపకమిషనర్లను ఆదేశించారు. సమావేశంలో ఉపకమిషనర్లు జోనా, శ్రీనివాస్రెడ్డి, ఆర్వోలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM