పుస్తకాలు గప్చిప్..!!
శాస్త్ర, సాంకేతిక నిపుణులు రచించిన లక్షలాది పుస్తకాలకు మరింత భద్రత కల్పించేలా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లోని గ్రంథాలయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఇందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)
నిట్ గ్రంథాలయంలో ఆర్ఎఫ్ఐడీ సాంకేతికత
- న్యూస్టుడే, నిట్ క్యాంపస్
గ్రంథాలయంలో అధ్యయనంలో నిమగ్నమైన విద్యార్థులు
శాస్త్ర, సాంకేతిక నిపుణులు రచించిన లక్షలాది పుస్తకాలకు మరింత భద్రత కల్పించేలా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్)లోని గ్రంథాలయంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఇందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీని అమలు చేశారు. ఎస్ఆర్.రంగనాథన్ జయంతి సందర్భంగా ఇటీవల జరిగిన జాతీయ గ్రంథాలయ దినోత్సవం రోజున ఈ సాంకేతికతతో పూర్తి స్థాయిలో అనుసంధానం చేసిన లైబ్రరీని డైరెక్టర్ ఆచార్య రమణారావు ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభించిన సాంకేతికతతో ప్రతి పుస్తకానికి చిప్ అమర్చడం వంటి భద్రతతో పాటు ఉపయోగకరమైన అంశాలున్నాయి.
కనిపించకుండా చిప్..
పలు దేశాల్లో పుస్తకాలకు అమర్చుతున్న క్యూఆర్ కోడ్, ఎలక్ట్రానిక్ చిప్స్, మ్యాగ్నటిక్స్ విధానంలా గ్రంథాలయంలోని పుస్తకంలో ఎవరికీ కనిపించకుండా ఆర్ఎఫ్ఐడీ చిప్తో పాటు ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ స్ట్రిప్ (ఈఎంఎస్) అమరుస్తారు. చిప్ ఏటీఏం కార్డు మాదిరిగా ఉంటుంది. ఎవరైనా చిప్ చించేస్తే మరో మ్యాగ్నటిక్ స్ట్రిప్ గుర్తిస్తుంది. ఈఎంఎస్ స్ట్రిప్ను గుర్తించడం ఎవరి వల్ల సాధ్యం కాదు.
అలారంతో అప్రమత్తం..
అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి లైబ్రరీలో సభ్యత్వం ఉంటుంది. సభ్యులను కేటగిరీలుగా విభజించి టెక్నాలజీ చిప్తో రూపొందించిన గుర్తింపు కార్డులు జారీ చేశారు. అధ్యాపకులకు ఎరుపు రంగు, విద్యార్థులకు ఆకుపచ్చ, బోధనేతర సిబ్బందికి నీలి రంగు, మాస్టర్స్ విద్యార్థులకు గులాబీ రంగు చిహ్నంతో కార్డులు జారీ చేశారు. లైబ్రరీ ప్రవేశ మార్గంలో ‘మెటల్ సెక్యూరిటీ గేట్’ ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు అనధికారికంగా పుస్తకం బయటకు తీసుకెళ్తే వెంటనే అలారంతో సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
యంత్రంలో నమోదు చేస్తే..
గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకోవాలంటే సభ్యుల వివరాలు నమోదు చేసుకుని జారీ చేసేవారు. ఇక నుంచి మరింత సులభతరంగా పుస్తకాలు తీసుకెళ్లవచ్ఛు ఏటీఎం మాదిరి యంత్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైన పుస్తకం తీసుకెళ్లేవారు యంత్రం వద్ద ఐడీ కార్డు ద్వారా స్వయంగా నమోదు చేసి తీసుకెళ్లవచ్ఛు ఎనీ టైమ్ బుక్ సిస్టం పేరుతో ఏర్పాటు చేసిన ఈ యంత్రంలో ఇష్యూ, రెన్యూవల్, రిటన్, అకౌంట్స్ ఆప్షన్లు కనిపిస్తాయి. పుస్తకం తిరిగి ఇవ్వాలనుకునే వారు ‘రిటన్ ఆప్షన్’ ఎంచుకోవాలి. కొత్తగా తీసుకునే వారు ఇష్యూ ఆప్షన్, గడువు పొడగింపునకు రెన్యువల్, ఖాతా వివరాలకు అకౌంట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. యంత్రం వద్ద పుస్తకం సమర్పించిన తర్వాత నమోదు చేయకుండా అదే పుస్తకం బయటకు తీసుకెళ్తే ప్రవేశమార్గంలో అల్లారం మోగుతూ ఎరుపు రంగు బుగ్గ హెచ్చరిక జారీ చేస్తుంది.
సెలవుల్లోనూ..
సెలవు రోజుల్లోనూ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు డ్రాప్ బాక్స్ విధానం ప్రవేశపెట్టారు. లైబ్రరీ బయట ప్రవేశ మార్గంలో డ్రాప్ బాక్స్ పేరుతో యంత్రం ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఎప్పుడైనా సరే పుస్తకాలు తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. డ్రాప్ బాక్సు వద్ద కంప్యూటర్పైన పుస్తకం ఉంచితే వివరాలు కనిపిస్తాయి. ‘సబ్మిట్ బుక్ ఆప్షన్’ ఎంపిక చేస్తే పుస్తకం లోపలికి వెళ్లి రశీదు బయటకు వస్తుంది. వెంటనే సభ్యుల ఖాతా నుంచి పుస్తకం తిరిగి సమర్పించినట్లు నమోదవుతుంది. త్వరలోనే లైబ్రరీ లోపలికి వెళ్లడానికి రాత్రి సమయం పొడిగించి మానవరహిత సేవలు అందించేలా సన్నాహాలు చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో..
ఆర్ఈసీగా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సేకరించిన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడ రికార్డు స్థాయిలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనంత పుస్తక సంపద నిట్ లైబ్రరీ సొంతం. 1923లో ముద్రించిన ‘ఎర్తింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్’ అనే పుస్తకం నుంచి 2023 విద్యాసంవత్సరానికి గాను ప్రచురించిన కొత్త గ్రంథాలు సుమారు 1,85,000 వరకు ఉన్నాయి. గతంలో ఏటా ఆడిట్ నిర్వహించినప్పుడు లెక్క తేల్చడానికి ఏడు నెలల సమయం పట్టేది. ఆర్ఎఫ్ఐడీ టెక్నాలజీతో వారం రోజుల్లోనే పూర్తి చేయవచ్ఛు అల్మారాలో పుస్తకాలు తారు మారైనప్పుడు స్కానర్ సాయంతో ఎక్కడున్నా గురించవచ్ఛు కంప్యూటర్లో పుస్తకం కోడ్ ఎంటర్ చేసి స్కానర్ చూపిస్తూ పోతే మాయమైన పుస్తకం ఉన్న చోటు పసిగట్టి అల్లారం వినిపిస్తుంది.
నాలులు నెలలు శ్రమించి.. - డాక్టర్ కె.వీరాంజనేయులు, గ్రంథపాలకుడు.
లైబ్రరీలోని అన్ని పుస్తకాలకు ఆర్ఎఫ్ఐడీ అనుసంధానం చేయడానికి నాలుగు బృందాలు కలిసి సుమారు నాలుగు మాసాలు శ్రమించాం. అరుదైన గ్రంథాలు, నిపుణుల రచనలకు జాగ్రత్తగా చిప్లు అమర్చాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు, సభ్యులకు మరింత సులభతరంగా పుస్తకాలు ఇచ్చి, పుచ్చుకునే అవకాశం కలిగింది.
భావితరాలకు అందించేందుకే.. - ఆచార్య ఎన్వీ.రమణారావు, నిట్ సంచాలకుడు
దేశంలో ఏ విద్యాసంస్థలో లేనన్ని పుస్తకాలు నిట్లో ఉన్నాయి. అరుదైన పురాతన గ్రంథాలతో పాటు, శాస్త్ర, సాంకేతిక నిపుణుల రచనలు, విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగకరమైన సంపద లైబ్రరీలో ఉంది. అన్నింటినీ భావితరాలకు అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అమలులోకి తెచ్చాం. పుస్తక పాఠకులకు సమయం ఆధా కావడంతో పాటు, పారదర్శకంగా సేవలు అందుతాయి. ఇక నుంచి ఎట్టి పరిస్థితిలోనూ పుస్తకాలు మాయం కావడం, తారుమారు కావడం లాంటి సమస్యలు తలెత్తవు.
నిట్లో
అధ్యాపకులు : 328
యూజీ విద్యార్థులు : 3815
మాస్టర్స్ విద్యార్థులు : 1979
పీహెచ్డీ విద్యార్థులు : 750
నాన్ టీచింగ్ స్టాఫ్ : 250
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతల ఆగమనం
[ 19-04-2024]
భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం
[ 19-04-2024]
జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. -
ఆనాడు చంద్రబాబు అన్నీ తానై..
[ 19-04-2024]
అవి 2009 శాసనసభ ఎన్నికలు.. మహాకూటమి నుంచి తెదేపా అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి నర్సంపేట నుంచి పోటీ చేశారు. -
జైలు నుంచి పోటీ.. మూడు చోట్ల గెలుపు
[ 19-04-2024]
భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించాక 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. -
ఒకటి.. రెండు.. ఒకటి.. రెండు..
[ 19-04-2024]
ఉమ్మడి వరంగల్లో లోక్సభ నియోజకవర్గాల ప్రస్థానం, మార్పులు చేర్పులు ఆసక్తిని కలిగిస్తాయి.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారీ ఏదో ఒక మార్పు జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. -
కంటి సమస్యలు లేని బాల్యమే లక్ష్యంగా..
[ 19-04-2024]
విద్యార్థులకు కంటి చూపు సమస్య ఉంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే), వైద్యశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. -
పాఠశాలల అభివృద్ధికి నిధులు
[ 19-04-2024]
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. -
రేషన్కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డులను ఈ-కేవైసీ చేయించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినా రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ఈ-కేవైసీ కొనసాగుతోంది. -
కడియం కావ్య విజయం ఖాయం
[ 19-04-2024]
వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం ఖాయమని, తూర్పు నియోజకవర్గం నుంచే 50 వేల మెజార్టీ తథ్యమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. -
బోరు ఒకటి.. కనెక్షన్లు 27
[ 19-04-2024]
గిరిజన పల్లెల్లో కన్నీటి గోస తీవ్రమవుతోంది. వేసవి తీవ్రతకు నీటి వనరుల్లో జలం అడుగంటుతుండటంతో.. పలు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
నేర నియంత్రణకు సైబర్ వారియర్స్
[ 19-04-2024]
ప్రస్తుత కాలంలో చరవాణి లేనిదే రోజు గడవడం లేదు. అదే సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో.. చాలా మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. -
మహిళలకు భరోసా..!
[ 19-04-2024]
మెరుగైన ఆరోగ్యానికి ప్రత్యేక కార్యక్రమంమహబూబాబాద్, న్యూస్టుడే: సమతుల్య ఆహారం తీసుకోకపోవడం, జీవన విధానంలో వస్తున్న మార్పులతో మహిళలు అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ జనజాతర సభకు సర్వం సిద్ధం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గిరిజనులకు రిజర్వు అయిన మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరు కానున్నారు. -
నేతన్నల భూములపై అక్రమార్కుల కన్ను
[ 19-04-2024]
నేతన్నలు చెమటోడ్చి మగ్గంపై శ్రమిస్తేగానీ పూట గడవదు. అలా వారు రూపాయి రూపాయి పోగు చేసి కూడబెట్టుకుని కొనుక్కున్న స్థలాలను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. -
సుధీర్కుమార్కు భారాస బీఫారం
[ 19-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్కు బీఫారం అందజేశారు. -
రసీదులకు అదనపు రుసుం..!
[ 19-04-2024]
ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల