నిధుల హామీతోనే జనగామలో అడుగు పెట్టాలి
జనగామకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తాననే హామిని బండి సంజయ్ ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జనగామ టౌన్, న్యూస్టుడే: జనగామకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తాననే హామిని బండి సంజయ్ ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డిమాండ్ చేశారు. జనగామలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీతి అయోగ్ సిఫార్సుల మేరకు రాష్ట్రానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులకు రూ.25వేల కోట్లు కేంద్రంతో బండి సంజయ్ కొట్లాడి సాధించాలన్నారు. జనగామ పట్టణానికి అవసరమైన డ్రైనేజీకి రూ.100 కోట్లు, వైద్య కళాశాలకు నిధులు, సాగు, తాగునీటి అవసరాలకు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని జనగామ సభలో ప్రకటించాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను మోదీని అడిగి సాధించుకురావాలని, లేనిపక్షంలో భాజపా అధ్యక్ష పదవితో పాటు ఎంపీకి రాజీనామా చేయాలన్నారు. నిధుల కోసం రాజీనామా చేస్తే తామే బండి సంజయ్ గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. బండి సంజయ్ని అడ్డుకుంటారా అని ఎమ్మెల్యేను విలేకరులు ప్రశ్నించగా.. తాము అడ్డుకోబోమని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే భాజపాకు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ పోకల జమున, వైస్ ఛైర్మన్ రాంప్రసాద్, ఎంపీపీ కళింగరాజు, కౌన్సిలర్లు వాంకుడోత్ అనిత, పాండు, నాయకులు పోకల లింగయ్య, సురేష్రెడ్డి, ఉడుగుల కిష్టయ్య, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం
వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అవసరమని, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు రక్తదాన శిబిరాలను నిర్వహించాలన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 9వేల యూనిట్ల రక్తాన్ని సేకరించిందని తెలిపారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పీటీసీ సభ్యురాలు నిమ్మతి దీపిక, జిల్లా ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్రాజు, రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ రాంనర్సయ్య, వైద్యులు చాయాదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్