నగరంపైనా భద్రతా కవచం
ఆధునిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మహా నగరపాలక సంస్థ అడుగులేస్తోంది. ఆకర్షణీయ నగరం(స్మార్ట్ సిటీ) పథకం ద్వారా సుమారు రూ.90 కోట్లతో సమీకృత నిఘా నిర్వహణ కేంద్రం(ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు. బల్దియా నూతన కౌన్సిల్ హాల్ భవనంలో
బల్దియాలో రూ.90 కోట్లతో సమీకృత నిర్వహణ కేంద్రం ఏర్పాటు
న్యూస్టుడే, కార్పొరేషన్
ఆధునిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మహా నగరపాలక సంస్థ అడుగులేస్తోంది. ఆకర్షణీయ నగరం(స్మార్ట్ సిటీ) పథకం ద్వారా సుమారు రూ.90 కోట్లతో సమీకృత నిఘా నిర్వహణ కేంద్రం(ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నారు. బల్దియా నూతన కౌన్సిల్ హాల్ భవనంలో తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు. కమిషనర్ ఛాంబర్ భవనం రెండో అంతస్తులో శాశ్వతంగా ఈ కేంద్రం పనులు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపికైన 100 నగరాల్లో తప్పని సరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ సూచించింది. మే 7 న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బల్దియాలో ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. తక్షణ సేవల కోసం కొత్త కౌన్సిల్ హాల్ మొదటి అంతస్తులో తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు. నాలుగు ఎల్ఈడీ తెరలు, నాలుగు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఏసీˆలు, ఆడియో సిస్టమ్, కుర్చీలు ఏర్పాటు చేశారు. రెండు, మూడు వారాలుగా కొన్ని సేవలను కమిషనర్ ప్రావీణ్య, వింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. బల్దియా వాహనాలకు ఏర్పాటు చేసిన వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్, జీపీˆఆర్ఎస్ సిస్టమ్, వరంగల్ నగరంలో ట్రాఫిక్ తదితర సేవలు పర్యవేక్షిస్తున్నారు. మూడు, నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులంటున్నారు.
సేవలు ఇలా..
* వరంగల్ పోలీసు కమిషనరేట్ సెంటర్లోఉన్న నిఘా వ్యవస్థకు అనుసంధానంగా ఈకేంద్రం పనిచేస్తుంది. 14 అంశాల్లో ఆధునిక సేవలు అందుబాటులోకి తెస్తారు. దీని ద్వారా వరంగల్ నగర పరిధిలో ఏం జరుగుతుందో పరిశీలించే వీలుంటుంది. వాతావరణం, భారీ వర్షాలు తదితరాలపై ముందస్తు హెచ్చరికలు తెలిసే వీలుంటుంది.
* నగరంపై నిఘా
*మెరుగైన రాకపోకల వ్యవస్థకు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంటు సిస్టం
* 10 ప్రాంతాల్లో ఎర్ర బుగ్గ అతిక్రమణ గుర్తించే సెన్సార్లు
* 10 ప్రాంతాల్లో వాహనాల వేగం గుర్తించే సెన్సార్లు
* ఒక ప్రాంతంలో వ్యతిరేక దిశలో నడిచే వాహనాన్ని గుర్తించే సెన్సార్లు
* ఇ-చలానా పంపించే ఏర్పాట్లు
* 10 ప్రాంతాల్లో వాతావరణ సమాచారాన్ని గుర్తించే సెన్సార్లు
* 10 ప్రాంతాల్లో అస్థిర(వేరియబుల్) సమాచారం పంపే ఏర్పాట్లు
* హోస్టింగ్ స్టేట్ డేటా సెంటర్
* జీఐఎస్
* ఇ-గవర్నెన్స్
* సమీకృత వాతావరణ సమాచారానికి ఐఎండీతో అనుసంధానం
* ఐసీటీ బేస్డ్ ఘనవ్యర్థాల నిర్వహణ విధానం
* సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్(సీసీఎంఎస్) వీధి దీపాలు
* వరంగల్ మహా నగరపాలక సంస్థకు సంబంధించిన పరిపాలన, క్షేత్రస్థాయి పనులు, తాగునీటి సరఫరా, లేఅవుట్ ఓపెన్ స్పేస్లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు తదితరాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.