ఆటలో నెగ్గి.. శిక్షకుడిగా ఎదిగి..!
హ్యాండ్బాల్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. ప్రస్తుతం అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్రీడపై నేటితరం ఆసక్తి కనబరుస్తోంది. పాఠశాల దశలో ఈ హ్యాండ్బాల్ క్రీడలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. జాతీయ స్థాయిలో రాణిస్తూ.. నేడు జాతీయ జట్టుకు కోచ్గా ఎదిగారు. భారత మహిళా బీచ్ హ్యాండ్బాల్ జట్టు కోచ్గా రాణించారు.
-న్యూస్టుడే, వరంగల్ క్రీడావిభాగం, రంగంపేట
హ్యాండ్బాల్ అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. ప్రస్తుతం అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్రీడపై నేటితరం ఆసక్తి కనబరుస్తోంది. పాఠశాల దశలో ఈ హ్యాండ్బాల్ క్రీడలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. జాతీయ స్థాయిలో రాణిస్తూ.. నేడు జాతీయ జట్టుకు కోచ్గా ఎదిగారు. భారత మహిళా బీచ్ హ్యాండ్బాల్ జట్టు కోచ్గా రాణించారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ కోచ్గా విధులు నిర్వహిస్తున్న విష్ణువర్ధన్పై ‘న్యూస్టుడే’ స్ఫూర్తిదాయక కథనం.
తొలి గురువు రామ్మూర్తి ప్రోత్సాహం
ఖిలావరంగల్కు చెందిన విష్ణువర్ధన్ విద్యార్థి దశలో ఆరేపల్లి రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో కోచ్ రామ్మూర్తి వద్ద 2004లో హ్యాండ్బాల్లో శిక్షణ తీసుకున్నారు. పదో తరగతి పూర్తిచేసే లోపు జిల్లా స్థాయిలో అండర్-14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ఐ పోటీల్లో చురుగ్గా రాణించారు. విష్ణువర్ధన్ ఆసక్తిని, ప్రతిభను గమనించిన రామ్మూర్తి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో రాష్ట్ర, జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో దూసుకెళ్లాడు. 2014వరకు క్రీడాకారుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన విష్ణువర్ధన్ 2016 నుంచి హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థ శిక్షకుడిగా కొనసాగుతున్నారు.
జాతీయ జట్టుకు కోచ్గా
ఇటీవల థాయ్లాండ్లో 8వ ఏషియన్ ఉమెన్ బీచ్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ టోర్నీలో పాల్గొన్న భారత మహిళా జట్టుకు విష్ణువర్ధన్ కోచ్గా వ్యవహరించారు. వియత్నాం, హాంగ్కాంగ్, థాయ్లాండ్ దేశాల జట్లు పాల్గొన్నాయి. జిల్లా, రాష్ట్రాల జట్లకు కోచ్గా పనిచేసిన అనుభవంతో తొలిసారిగా జాతీయ జట్టుకు నేతృత్వం వహించారు. ఈ టోర్నీలో భారత జట్టు మూడో స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రిఫరీగా అనుభవం విష్ణు సొంతం. ఇలా మూడు విభిన్న పాత్రల్లో రాణిస్తూ యువత, క్రీడాకారులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.
జాతీయ స్థాయికి తీసుకెళ్తా..: బొడ్డు విష్ణువర్ధన్
హ్యాండ్బాల్ క్రీడలో ప్రతిభగల క్రీడాకారులను తయారుచేస్తా. డీఎస్ఏ ఆధ్వర్యంలో ప్రణాళికతో కూడిన శిక్షణ కొనసాగుతోంది. ఇటీవల హనుమకొండ జేఎన్ స్టేడియంలో నిర్వహించిన వేసవి శిబిరంలో నూతన తరం విద్యార్థులు హ్యాండ్బాల్ వైపు ఆసక్తి చూపారు. వారిని జాతీయ స్థాయికి తీసుకెళ్లేవరకు ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. తన విజయంలో సీనియర్ శిక్షకులు రామ్మూర్తి, శ్యామల పవన్, శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ సొటాల ధనలక్ష్మి, క్రీడల అభివృద్ధి అధికారులు ఇందిర, శివకుమార్ పాత్ర ఎంతో ఉంది.
భారత బీచ్ హ్యాండ్బాల్ మహిళా జట్టుతో విష్ణువర్ధన్
క్రీడాకారుడిగా విజయాలు..
* వరంగల్లో 2015లో జరిగిన సీనియర్ నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్
* ఛత్తీస్గఢ్లో 2015లో జరిగిన సీనియర్ నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్
* తమిళనాడులో 2019లో జరిగిన సీనియర్ నేషనల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్
శిక్షకుడిగా..
* ఏషియన్ ఉమెన్ బీచ్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో జట్టుకు కాంస్యం
* హైదరాబాద్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణం
* హైదరాబాద్ జరిగిన ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణం
* ఖిలావరంగల్లో జరిగిన సౌత్జోన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం
* సిద్ధిపేటలో జరిగిన జాతీయ స్థాయి బాలుర విభాగంలో కాంస్యం
* హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్లో జరిగిన టాలెంట్ హంట్లో స్వర్ణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!