విద్యుత్తు తీగలు.. మృత్యుపాశాలు
రేగొండ మండలం దుంపిల్లపల్లికి చెందిన బత్తిని కుమారస్వామి(45) అనే రైతు మూడు రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మిర్చి సాగు కోసం నాగలి భుజాన ఎత్తుకుని వెళ్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలకు తగిలి చేనులోనే విగతజీవిగా మారారు. ఇక్కడ ప్రమాదముందని గుర్తించినా అధికారులు సకాలంలో పని
రేగొండ మండలం దుంపిల్లపల్లికి చెందిన బత్తిని కుమారస్వామి(45) అనే రైతు మూడు రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మిర్చి సాగు కోసం నాగలి భుజాన ఎత్తుకుని వెళ్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలకు తగిలి చేనులోనే విగతజీవిగా మారారు. ఇక్కడ ప్రమాదముందని గుర్తించినా అధికారులు సకాలంలో పని చేయకపోవడంతో ఓ నిండు ప్రాణం బలయ్యింది.
ఈనాడు డిజిటల్, ములుగు: ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు రైతులు తన పంట పొలాన్నే తలుచుకుంటారు. ఈరోజు దుక్కిదున్నాను.. రేపు విత్తనాలు వేయాలి.. మరుసటి రోజు ఎరువులు వేద్దాం.. పైరుకు నీరు పెట్టాలి.. విద్యుత్తు ఏ సమయానికి వస్తుందో ఇలా మదిలో సాగుపైనే ఆలోచనంతా.. అలాంటి రైతులకు విద్యుత్తు తీగలు యమపాశాలుగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా చేతికి అందే విధంగా జాలువారిన విద్యుత్తు తీగలు, పొలాల్లో గట్లు, ఊతకర్రల ఆధారంగా ఉన్న లైన్లు, కంచెలేని నియంత్రికలు, పగుళ్లు బారిన స్తంభాలు ఇలా.. ప్రమాదభరితంగా ఉంటున్నాయి.. చివరకు విద్యుదాఘాతానికి గురై అమాయక రైతులు విద్యుదాఘాతానికి బలవుతున్నారు.
ఇది ఖానాపురంలోని నల్లాల బావి రోడ్డులో పొలాలకు వెళ్లే విద్యుత్తు లైన్. స్తంభం కింది భాగంలో శిథిలమై ప్రమాదకరంగా మారింది. అధికారులు దాన్ని తొలగించకుండానే పక్కన మరో స్తంభం వేశారు. వేసవిలో ప్రమాదం పొంచి ఉన్నందున తొలగించాలని స్థానికులు కోరారు. గ్రామ శివారులోని నక్కల ఒర్రె పొలాల్లో తీగలు కిందికి వేలాడుతున్నాయని సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఈ సమస్యలు అలాగే ఉన్నాయి.
ఇది రేగొండ మండలం జగ్గయ్యపేటలోనిది. తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఇటువైపు నుంచే రైతులు పొలాలకు వెళ్తుంటారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు.
గత నెల 3న టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్(వి)కు చెందిన కర్రె కోమల(40) గుమ్మడవెల్లి శివారులో వరినాటు వేసేందుకు కూలీ పనికి వెళ్లారు. పొలంలో అప్పటికే 11 కేవీ విద్యుత్తు పొలంలో పడి ఉంది. పని చేస్తుండగా తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
పల్లె ప్రగతిలో పరిష్కారం కాని సమస్యలు..
పల్లె ప్రగతిలో విద్యుత్తు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశాలున్నాయి. అధికారులు, సిబ్బంది సమస్యలు గుర్తించినా వాటికి వ్యయం ఎక్కువవుతుందని.. కేవలం అత్యవసరమైనవి మాత్రమే చేపట్టి మమ అనిపించారు. వర్షాకాలం ముందస్తు జాగ్రత్త చర్యల కింద మరమ్మతులు చేయాల్సి ఉన్నా పలుచోట్ల పట్టించుకోలేదు.
* క్షేత్ర స్థాయి సిబ్బంది ఖాళీలు వేధిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఉండే ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తున్నారు. వారికి సరైన అవగాహన లేక పనులు సక్రమంగా చేపట్టడం లేదు.
* వదులు తీగలు, శిథిలమైన విద్యుత్తు స్తంభాల తొలగింపు, కంచె లేని నియంత్రికలు, తదితర సమస్యలను గుర్తించి అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
పట్టించుకోవడం లేదు - కుమార్, రైతు జగ్గయ్యపల్లి
పొలాల వైపు వెళ్లే విద్యుత్తు లైను తీగలు కిందకు వేలాడుతున్నాయి. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రమాదం పొంచి ఉంది. అలాగే అక్కడే లెవన్ కేవీ తీగ కూడా తెగిపోయింది. దానికి విద్యుత్తు సరఫరా లేకపోయినా అది అలాగే వదిలేశారు. తెగిన తీగను చెట్టుకు కట్టారు.
రక్షణ చర్యలు తీసుకుంటున్నాం - ఎ. గోపాల్రావు, సీఎండీ, ఎన్పీడీసీఎల్
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఇంకా కొన్ని ఖాళీలున్నాయి. వాటిని కూడా నియామకాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు విద్యుత్తు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్యలుంటే అధికారులను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం