ఇంటర్ ‘ప్రథమ’లో ప్రవేశాలు అంతంతే..
ఈ విద్యా సంవత్సరంలో (2022-23) జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ఇంటర్మీడియట్లో ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత సంవత్సరం కంటే ప్రవేశాలు సుమారు రెండు వందలు తగ్గాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో
మానుకోట, న్యూస్టుడే: ఈ విద్యా సంవత్సరంలో (2022-23) జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ఇంటర్మీడియట్లో ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత సంవత్సరం కంటే ప్రవేశాలు సుమారు రెండు వందలు తగ్గాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో బాలురు 4,101 మంది, బాలికలు 4,320 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టులో నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో 288 మంది బాలురు, 226 మంది బాలికలు.. మొత్తం 8,925 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ సాధారణ గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో 44 వరకు సీట్లు ఉండగా ప్రతి కళాశాలలో 176 వరకు ఉంటాయి. ఈ విధంగా మొత్తం 1,760 వరకు సీట్లు ఉండగా 872 మంది మాత్రమే చేరారు. నాలుగు కళాశాలల్లో వివిధ వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఒక్కో కోర్సులో 40 సీట్లు ఉండగా ప్రవేశాలు కొంత వరకు ఫర్వాలేదు. 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సాధారణ, వృత్తి విద్యా కోర్సుల్లో మొత్తం 1,103 మంది మాత్రమే చేరారు.
ప్రవేశాలు ఇంకా పెరగొచ్చు..
- సమ్మెట సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
గత సంవత్సరం కంటే ఈసారి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు తగ్గిన మాట వాస్తవమే. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు ప్రవేశాల కోసం పదో తరగతి పాసైన విద్యార్థుల ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సౌకర్యాల గురించి వివరించారు. ప్రవేశాలకు ఈ నెలఖరు వరకు గడువు ఉంది. ఇంకా ప్రవేశాలు పెరగవచ్చని భావిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జజ్జనకర.. జనజాతర
[ 25-04-2024]
కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేయడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
ప్రథమంలో 24 ద్వితీయంలో 26
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనుకబడింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 24వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 26వ స్థానంలో నిలిచింది. -
హస్తం జోరు..
[ 25-04-2024]
హనుమకొండ జిల్లా పరిధిలోని కాజీపేట మండలం మడికొండలో నిర్వహించిన ఓరుగల్లు జనజాతర బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ఇంటర్ ఫలితాల్లో ములుగు వెలుగు
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను వెనకకు నెట్టి ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. -
బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలికలే పై చేయి సాధించారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఉత్తీర్ణత శాతం గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వెనక్కి వెళ్లింది. -
21 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి బుధవారం 19 మంది అభ్యర్థులు 21 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు సమర్పించారు. భారాస పార్టీ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ తరఫున భారాస నాయకులు, -
ఆదర్శం.. గంగారం కస్తూర్బా విద్యాలయం
[ 25-04-2024]
మారుమూల ఏజెన్సీలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో వందశాతం ఫలితాలు సాధించి సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM